Rakul: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం!

  • స్పీడు తగ్గిస్తానంటున్న రకుల్ 
  • బన్నీతో కొరటాల ప్రాజక్ట్ 
  • కల్యాణ్ రామ్ చిత్రానికి భారీ రేటు 
  • 'మళ్లీ రావా' అంటున్న సుమంత్

*  'ఇకపై కాస్త స్పీడు తగ్గిద్దామనుకుంటున్నాను..' అంటోంది ప్రెట్టీ డాల్ రకుల్ ప్రీత్ సింగ్. ఇటీవలి కాలంలో సినిమాలలో విరామం లేకుండా పనిచేయడంపై ఆమె మాట్లాడుతూ, 'గత నాలుగేళ్లుగా రెస్ట్ అన్నది లేకుండా వరుసగా సినిమాలు చేస్తూ వస్తున్నాను. మంచి కథలు వదులుకోవడం ఇష్టం లేకనే అలా చేయాల్సివచ్చింది. అయితే, ఇది ఆరోగ్యం మీద ప్రభావం చూపించే అవకాశం వుంది కాబట్టి, ఇకపై కాస్త మెల్లిగా చేసుకుంటూ వెళదామని అనుకుంటున్నాను' అని చెప్పింది రకుల్.      
*  కొరటాల శివ, అల్లు అర్జున్ కాంబినేషన్లో ఓ భారీ చిత్రాన్ని నిర్మించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించనున్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన చర్చలు ప్రస్తుతం జరుగుతున్నాయి.
*  నందమూరి కల్యాణ్ రామ్, తమన్నా హీరో హీరోయిన్లుగా జయేంద్ర దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ నెల 29 నుంచి ఈ చిత్రం తాజా షెడ్యూల్ షూటింగ్ జరుగుతుంది. కాగా, ఈ చిత్రానికి నిర్మాణంలో ఉండగానే క్రేజ్ రావడంతో శాటిలైట్ హక్కులను జెమిని టీవీ 4.75 కోట్లకు సొంతం చేసుకున్నట్టు తాజా సమాచారం.
*  అక్కినేని ఫ్యామిలీ హీరో సుమంత్, ఆకాంక్ష సింగ్ జంటగా నటించిన 'మళ్లీ రావా' చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులను పూర్తి చేసుకుంది. గౌతమ్ తిన్న సూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని డిసెంబర్ 8న విడుదల చేయనున్నట్టు నిర్మాత ప్రకటించారు. గతంలో తాను చేసిన 'గోదావరి' సినిమా తర్వాత మళ్లీ అంతటి సంతృప్తిని కలిగించిన సినిమా ఇదని హీరో సుమంత్ చెప్పాడు.  

  • Loading...

More Telugu News