Telugudesam head office: టీడీపీ జాతీయ కార్యాలయం శంకుస్థాపనకు ముహూర్తం ఖరారు

  • మంగళగిరి మండలం ఆత్మకూరు వద్ద జాతీయ కార్యాలయం
  • 26వ తేదీ తెల్లవారుజామున శంకుస్థాపన
  • ఇప్పటికే డిజైన్ ను ఆమోదించిన చంద్రబాబు

తెలుగుదేశం పార్టీ తన జాతీయ కార్యాలయాన్ని ఏపీలో నిర్మించనుంది. గుంటూరు జిల్లా మంగళగిరి మండలం ఆత్మకూరు వద్ద ఈ కార్యాలయాన్ని నిర్మించబోతున్నారు. ఈ నెల 26వ తేదీ ఉదయం 5.17 గంటలకు ముహూర్తాన్ని ఖరారు చేసినట్టు టీడీపీ కార్యాలయ కార్యదర్శి ఏవీ రమణ ఓ ప్రకటన ద్వారా తెలిపారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు ఈ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారని ప్రకటనలో పేర్కొన్నారు. మొత్తం నాలుగు బ్లాకులుగా ఈ కార్యాలయం నిర్మితమవుతుందని చెప్పారు. పార్టీ కార్యాలయం డిజైన్ ను చంద్రబాబు ఇప్పటికే ఆమోదించారని తెలిపారు.  

More Telugu News