marriage: పెళ్లింట విషాద ఘ‌ట‌న‌... న‌లుగురి మృతి!

  • క‌రీంన‌గ‌ర్‌లోని రామగుండం, కుందనపల్లి సమీపంలోని స్వగృహ కాలనీలో ఘ‌ట‌న‌
  • పెళ్లి శుభ‌లేఖ‌లు పంచి తిరిగి వ‌స్తుండ‌గా కారు ప్ర‌మాదం
  • పెళ్లికొడుకు త‌ల్లిదండ్రులతో పాటు మ‌రో ఇద్ద‌రు కుటుంబ స‌భ్యుల మృతి

మ‌రికొన్ని రోజుల్లో పెళ్లి జ‌రగాల్సిన ఆ కుటుంబంలో తీవ్ర విషాద ఘ‌ట‌న చోటు చేసుకుంది. త‌మ కుమారుడి పెళ్లి చూసి మురిసిపోదామ‌నుకున్న త‌ల్లిదండ్రులు కాన‌రాని లోకాల‌కు వెళ్లిపోయారు. క‌రీంన‌గ‌ర్‌లోని రామగుండం మండలం కుందనపల్లి సమీపంలోని స్వగృహ కాలనీలో నివ‌సించే రవీందర్ రావు, సరితాబాయి దంపతులు ఇటీవ‌ల త‌మ కుమారుడికి పెళ్లి సంబంధం కుదుర్చుకుని, వివాహానికి ముహూర్తం పెట్టుకుని అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకుంటున్నారు.

ఈ క్రమంలో కుమారుడి పెళ్లి శుభలేఖలను బంధువుల‌కు పంచి తిరిగి ఇంటికి వెళుతోన్న స‌మ‌యంలో తిమ్మాపూర్ మండలం అలుగునూరు వద్ద రాజీవ్ రహదారిపై ఆగి ఉన్న లారీని వారి కారు ఢీ కొంది. దీంతో ఆ దంప‌తులతో పాటు మ‌రో ఇద్ద‌రు కుటుంబ స‌భ్యులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు కొన‌సాగిస్తున్నారు.    

More Telugu News