Hyderabad: నంది అవార్డుల‌పై మీడియా ఎక్కువ చేస్తోంది.. కులంతో ముడిపెట్ట‌డం స‌రికాదు: జ‌గ‌ప‌తి బాబు

  • హైద‌రాబాద్ ఐమ్యాక్స్ థియేట‌ర్ వద్ద జ‌గ‌ప‌తి బాబు పాద‌యాత్ర‌
  • అన్ని చిన్న‌ సినిమాల‌కు స్పందించ‌లేను క‌దా?
  • 'ర‌చ‌యిత' సినిమా ఆడుతుంద‌న్న న‌మ్మ‌కం నాకు ఉంది
  • చిన్న సినిమాల‌ను ప్రోత్స‌హించాలి

నంది అవార్డుల‌పై మీడియా అతి చేస్తోంద‌ని, ప్ర‌తి అంశాన్ని కులంతో ముడిపెట్ట‌డం స‌రికాదని సినీన‌టుడు జ‌గ‌ప‌తి బాబు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. 'ర‌చ‌యిత' సినిమా ప్ర‌చారంలో భాగంగా పాద‌యాత్ర చేస్తోన్న‌ జ‌గ‌ప‌తి బాబు చిన్న సినిమాల‌ను బ‌తికించాలంటూ చెప్పుకొస్తున్నారు. చిన్న సినిమాల‌పై ఇన్నేళ్లుగా మాట్లాడ‌ని మీరు ఇప్పుడెందుకు మాట్లాడుతున్నార‌ని మీడియా ప్ర‌శ్నించ‌గా.. అన్ని చిన్న‌ సినిమాల‌కు స్పందించ‌లేను క‌దా? అని స‌మాధానం ఇచ్చారు.

హైద‌రాబాద్ ప్ర‌సాద్ ఐమ్యాక్స్ వ‌ద్ద జ‌గ‌ప‌తి బాబు మీడియా స‌మావేశంలో మాట్లాడుతూ... చిన్న సినిమాల‌ను ప్రోత్స‌హించాల‌నే తానే ముందుకు వ‌చ్చాన‌ని తెలిపారు. 'ర‌చ‌యిత' చిత్రంలో తాను న‌టించ‌లేదని అన్నారు. ప్ర‌తి చిన్న సినిమా గురించి తాను మాట్లాడ‌లేనని అన్నారు. మొదట్లో ఈ సినిమాను తాను చేద్దామ‌నుకున్నానని, ఈ సినిమా ఆడుతుంద‌న్న న‌మ్మ‌కం త‌న‌కు ఉందని 'ర‌చ‌యిత' సినిమా గురించి చెప్పారు. అనంత‌రం రచ‌యిత సినిమా టైటిల్ పోస్ట‌ర్‌ను ఆవిష్క‌రించారు.

More Telugu News