srivishnu: కొత్త ప్రాజెక్టుల గురించి నేను .. నారా రోహిత్ మాట్లాడుకుంటాం: హీరో శ్రీవిష్ణు

  • 'మెంటల్ మదిలో' తో శ్రీవిష్ణు 
  • ఈ నెల 24వ తేదీన విడుదల 
  • సంభాషణలే ఈ సినిమాకి ప్రత్యేక బలం  

'అప్పట్లో ఒకడుండేవాడు' సినిమాలో నారా రోహిత్ తో కలిసి నటించిన శ్రీవిష్ణు, నటన పరంగా మంచి మార్కులు కొట్టేశాడు. ఆయన తాజా చిత్రంగా 'మెంటల్ మదిలో' సినిమా తెరకెక్కింది. ఈ నెల 24వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. దాంతో ఈ సినిమా ప్రమోషన్స్ లో శ్రీవిష్ణు బిజీగా వున్నాడు. ఐ డ్రీమ్స్ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ .. నారా రోహిత్ తో తనకి గల స్నేహాన్ని గురించి ప్రస్తావించాడు.

 " మేం ఇద్దరం తరచూ కలుసుకుని మాట్లాడుకుంటూ ఉంటాం. ఈ మధ్య ఎవరి సినిమాలతో వాళ్లం బిజీగా ఉంటున్నాంగానీ, అంతకు ముందు ఎక్కువగా కలుసుకుంటూ ఉండేవాళ్లం. ఎంత బిజీగా వున్నా ఇద్దరం కూడా చేయబోయే సినిమాలను గురించి చర్చిస్తాం .. ఆ తరువాతనే కమిట్ కావడం చేస్తాం. ఇక ఈ సినిమాలో ఎక్కడా ఎలాంటి ప్రాసల కోసం ప్రయత్నించని తెలుగుతో .. హాయిగా అనిపించే తెలుగుతో సంభాషణలు ఉంటాయి .. అవే ఈ సినిమాకి ప్రత్యేకతను తీసుకొస్తాయి" అని చెప్పుకొచ్చాడు.  

More Telugu News