balakrishna: చివరి షెడ్యూల్ షూటింగ్ కి రెడీ అవుతోన్న 'జై సింహా'

  • ఈ నెల 22 నుంచి కీలక సన్నివేశాల చిత్రీకరణ 
  • డిసెంబర్ 1వతేదీతో షూటింగు పార్టు పూర్తి 
  • అదే నెల 23న ఆడియో రిలీజ్ 
  • సంగీత దర్శకుడిగా చిరంతన్ భట్   

తమిళంలో పలు సూపర్ హిట్ చిత్రాలను అందించిన కేఎస్ రవికుమార్ .. తెలుగులోను కొన్ని సినిమాలు చేశారు. తాజాగా ఆయన బాలకృష్ణ కథానాయకుడిగా 'జై సింహా'ను తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన చిత్రీకరణ చాలా వరకూ పూర్తయింది. చివరి షెడ్యూల్ షూటింగును ఈ నెల 22వ తేదీ నుంచి ప్లాన్ చేశారు.

 ఆ రోజు నుంచి డిసెంబర్ 1వరకూ జరిగే చిత్రీకరణతో ఈ సినిమా షూటింగ్ పార్టు పూర్తికానుంది. హైదరాబాద్ లో జరిగే ఈ షూటింగులో ప్రధాన పాత్రధారులంతా పాల్గొననున్నారు. ఈ సినిమాకి చిరంతన్ భట్ సంగీతాన్ని సమకూర్చారు. ఆయన అందించిన ఆడియోను డిసెంబర్ 23వ తేదీన విడుదల చేయనున్నారు. నయనతార .. నటాషా దోషి .. హరిప్రియ కథానాయికలుగా నటిస్తోన్న ఈ సినిమాను, సంక్రాంతి కానుకగా జనవరి 12వ తేదీన విడుదల చేయనున్నారు.  

More Telugu News