'శ్రీనివాస కల్యాణం' తరువాత కూడా నితిన్ తోనే .. మాటిచ్చిన దిల్ రాజు!

షార్ట్స్‌లో చూడండి
ఒక వైపున ఫ్యామిలీ ఆడియన్స్ మెచ్చే సినిమాలు .. మరో వైపున యూత్ తో పాటు మాస్ ఆడియన్స్ కి నచ్చే సినిమాలు చేస్తుండటం దిల్ రాజు ప్రత్యేకత. ఇటీవలే ఆయన ఫ్యామిలీ ఆడియన్స్ కోసం 'శతమానం భవతి' సినిమా చేసి మంచి మార్కులు కొట్టేశారు. అదే తరహాలో ఆయన ఆ సినిమా దర్శకుడైన సతీశ్ వేగేశ్నతో 'శ్రీనివాస కల్యాణం' చేయడానికి రెడీ అవుతున్నారు. ఈ సినిమాలో కథానాయకుడిగా ఆయన నితిన్ ను ఎంపిక చేసుకున్నారు.

 త్వరలోనే ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమా తరువాత ప్రాజెక్టును కూడా ఆయన నితిన్ తోనే చేయాలనే నిర్ణయానికి వచ్చారట. అనిల్ రావిపూడి దర్శకత్వంలో దిల్ రాజు ఒక మల్టీ స్టారర్ చేయడానికి సిద్ధమవుతున్నారు. ఇందులో ఒక హీరోగా నితిన్ ను తీసుకుంటానని ఆయనకి మాట కూడా ఇచ్చారట. మొత్తానికి నితిన్ ఒకేసారి రెండు ఛాన్సులు కొట్టేశాడన్న మాట.    
Go Back to Shorts
dil raju
nithin

More Telugu News