Jagan: జగన్ నేటి పాదయాత్ర షెడ్యూల్ ఇదిగో!

  • బనగానపల్లె నియోజకవర్గానికి చేరుకున్న పాదయాత్ర
  • ఘన స్వాగతం పలికిన నియోజకవర్గ నేతలు, కార్యకర్తలు
  • ఉదయం దొర్నిపాడు నుంచి పాదయాత్ర ప్రారంభం

వైసీపీ అధినేత జగన్ పాదయాత్ర ఈ రోజు కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ మండలం దొర్నిపాడు నుంచి ప్రారంభమైంది. అల్పాహారం తీసుకున్న తర్వాత ఉదయం 8 గంటలకు జగన్ తన పాదయాత్రను కొనసాగించారు. ఉదయం 9 గంటల 30 నిమిషాలకు పాదయాత్ర కొలవకుంట్ల మండలం కంపమల్ల మెట్టకు చేరుకుంది. ఈ సందర్భంగా బనగానపల్లె నియోజకవర్గ వైసీపీ నేతలు, కార్యకర్తలు ఆయనకు ఘన స్వాగతం పలికారు.

అనంతరం ఉయ్యాలవాడ క్రాస్ రోడ్, భీమునిపాడు మీదుగా పాదయాత్ర కొనసాగుతుంది. అక్కడ పార్టీ జెండాను ఆవిష్కరించిన అనంతరం జగన్ భోజన విరామం తీసుకుంటారు. ఆ తర్వాత పెరా బిల్డింగ్స్, కోవెలకుంట్ల, కోవెలకుంట్ల బస్టాండ్ సెంటర్ మీదుగా సాయంత్రం 6.30 గంటల వరకు పాదయాత్ర కొనసాగుతుంది. కర్రా సుబ్బారెడ్డి విగ్రహం వద్దకు చేరుకోగానే నేటి పాదయాత్ర ముగుస్తుంది. ఈ రాత్రికి ఆయన అక్కడే బస చేస్తారు.  

More Telugu News