Sachin Tendulkar: సచిన్ సర్ నాకు అదే చెప్పారు.. కుల్దీప్ యాదవ్

  • సచిన్ నుంచి ఫోన్ వచ్చిందని తెలిసి నమ్మలేకపోయా
  • నా నుంచి ఆయన ఏదో ఆశిస్తున్నారని అర్థమైంది
  • లక్ష్యాన్ని నిర్దేశించారు.. దూసుకుపోతా

టీమిండియా చైనామన్ బౌలర్ కుల్దీప్ యాదవ్ ఓ విషయాన్ని బయటపెట్డాడు. ఆరు నెలల క్రితం జట్టులోకి వచ్చినప్పటితో పోలిస్తే కుల్దీప్ యాదవ్ తన ప్రతిభతో జట్టులో ప్రధాన ఆటగాడిగా మారాడు. ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన వన్డేలో హ్యాట్రిక్ సాధించి ఏకంగా బౌలింగ్‌లో మూడో ర్యాంకుకు ఎదిగాడు. అన్ని ఫార్మాట్లలోనూ సత్తా చాటుతున్నాడు. సమీప భవిష్యత్తులో కుల్దీప్ ప్రపంచంలోనే బెస్ట్ లెగ్ స్పిన్నర్‌గా మారుతాడని షేన్‌వార్న్ కితాబిచ్చాడు. భారత స్కిప్పర్ కోహ్లీ కూడా అతడో గొప్ప బౌలర్ అని ప్రశంసించాడు.

టీమిండియా బౌలింగ్ స్క్వాడ్‌లో ప్రధాన పాత్ర పోషిస్తున్న కుల్దీప్ తాజాగా క్రికెట్ దిగ్గజం సచిన్ తనకు ఇచ్చిన సలహా గురించి వెల్లడించాడు. టెస్ట్ మ్యాచ్‌లో అరంగేట్రం తర్వాత సచిన్ తనకు ఫోన్ చేసి తన లక్ష్యం 500 వికెట్లుగా ఉండాలని పేర్కొన్నాడని తెలిపాడు. ‘‘సచిన్ సర్ నుంచి ఫోన్ వచ్చిందని తెలిసి నమ్మలేకపోయా. నా లక్ష్యం 500 వికెట్లుగా ఉండాలని చెప్పారు. అప్పుడు అర్థమైంది నాకు, క్రికెట్ దేవుడు నా నుంచి ఏదో ఆశిస్తున్నారని’’ అని కుల్దీప్ వివరించాడు.

More Telugu News