delhi: ఢిల్లీ మెట్రో స్టేషన్ వ‌ద్ద యువ‌తిని అసభ్యంగా తాకిన వ్య‌క్తి.. సీసీ కెమెరాలో రికార్డు

  • ఐటీవో మెట్రో స్టేషన్‌లో ఓ లేడీ జర్నలిస్టు (25)కు చేదు అనుభ‌వం
  • వేధింపుల‌కు గురి చేసిన దుండగుడిపై తిర‌గ‌బ‌డ్డ యువ‌తి
  • సీసీ కెమెరాల ఆధారంగా పోలీసుల ద‌ర్యాప్తు
  • నిందితుడి గుర్తింపు.. అరెస్టు

ఢిల్లీ ఐటీవో మెట్రో స్టేషన్‌లో ఓ లేడీ జర్నలిస్టు (25) ను ఓ వ్య‌క్తి వేధింపులకు గురిచేసిన ఘ‌ట‌న అల‌జ‌డి రేపింది. ఢిల్లీలో వేధింపుల నిరోధానికి ఎన్ని చ‌ర్య‌లు తీసుకుంటున్నా ఇటువంటి ఘ‌ట‌న‌లు పున‌రావృతం అవుతున్నాయి. ఓ యువ‌తి మెట్రో స్టేష‌న్‌లో మెట్ల‌పై నుంచి కింద‌కు న‌డుచుకుంటూ వ‌స్తోంది. అదే స‌మ‌యంలో అక్క‌డ ఉన్న ఓ వ్య‌క్తి ఆమెను అస‌భ్య‌క‌రంగా తాకడానికి ప్ర‌య‌త్నించాడు. ఒక్క‌సారిగా కంగుతిన్న ఆ యువ‌తి, అంతలోనే తేరుకుని తిరగబడి, ఆ దుండ‌గుడిని త‌రిమి కొట్టింది. అనంత‌రం పోలీసుల‌కు ఫిర్యాదు చేసింది.

ఆమె ఫిర్యాదు మేరకు మెట్రోస్టేషన్‌లోని సీసీటీవీని ప‌రిశీలించిన పోలీసులు నిందితుడిని గుర్తించి అరెస్టు చేశారు. ఆ వ్య‌క్తి త‌న‌ను పొరపాటుగా తాకాడ‌ని అనుకున్నాన‌ని కానీ, నిందితుడు కావాలని అస‌భ్యంగా తాక‌డానికి మ‌ళ్లీ ప్ర‌య‌త్నించాడ‌ని బాధితురాలు చెప్పింది.




More Telugu News