ayodhya: నిన్న అయోధ్య‌లో.. నేడు ల‌క్నోలో శ్రీశ్రీ ర‌విశంక‌ర్ బిజీబిజీ!

  • ముస్లిం మ‌త పెద్ద‌ల‌తో చ‌ర్చలు
  • శాంతియుత ప‌రిష్కారం కోస‌మే నా ప్ర‌య‌త్నం
  • నాకు ఏ అజెండా లేదు- శ్రీశ్రీ ర‌విశంక‌ర్‌

అయోధ్యలోని వివాదాస్పద స్థలంలో రామ మందిరం- బాబ్రీ మసీదు నిర్మాణాల అంశంపై తాను మ‌ధ్య‌వ‌ర్తిత్వం వ‌హిస్తాన‌ని ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌ వ్యవస్థాపకుడు శ్రీ శ్రీ పండిట్‌ రవిశంకర్ ఇటీవ‌ల ప్ర‌క‌టించుకున్న విష‌యం తెలిసిందే. త‌న రాక‌ను కొంద‌రు అతివాదులు వ్య‌తిరేకిస్తూ వ్యాఖ్య‌లు చేసిన‌ప్ప‌టికీ, శ్రీశ్రీ ర‌విశంక‌ర్ నిన్న అయోధ్య‌లో ప‌ర్య‌టించి, ఈ రోజు ల‌క్నోకు వెళ్లారు.

అక్కడి ముస్లిం మత పెద్దలతో చ‌ర్చ‌లు జ‌రిపిన అనంత‌రం శ్రీ శ్రీ ర‌విశంక‌ర్ మీడియాతో మాట్లాడుతూ.. తాను కోర్టును గౌరవిస్తానని, అదే స‌మ‌యంలో కోర్టులు ఇచ్చే తీర్పులు మన మనసులకు చేరువ కాలేవన్న అభిప్రాయాన్ని వ్య‌క్తం చేశారు. ఈ విష‌యంలో ఇప్పటికే చాలా ఆలస్యం అయిందని తెలిపారు. తాను ఏదో అజెండాతో అక్క‌డ‌కు రాలేద‌ని, త‌న‌కు శాంతియుత ప‌రిష్కార‌మే ప్ర‌ధాన‌మ‌ని అన్నారు. 

More Telugu News