oil tanker: కిరోసిన్ ట్యాంకర్ బోల్తా.. ప‌రుగు ప‌రుగున డ‌బ్బాల‌తో వ‌చ్చిన స్థానికులు!

  • మధ్యప్రదేశ్‌లోని డిండోరీలో ఘ‌ట‌న‌
  • బోల్తా పడిన ట్యాంకర్‌లో నుంచి కిరోసిన్‌ను తీసుకోవ‌డానికి పోటీప‌డ్డ వైనం
  • వీడియో వైర‌ల్‌

రోడ్డుపై వెళుతోన్న ఓ కిరోసిన్ ట్యాంకర్ బోల్తా ప‌డడంతో స్థానికులు కిరోసిన్ కోసం ఎగ‌బ‌డ్డ ఘ‌ట‌న మధ్యప్రదేశ్‌లోని డిండోరీలో చోటు చేసుకుంది. పూర్తి వివ‌రాల్లోకి వెళితే, ఈ రోజు ఉదయం ఓ కిరోసిన్ ట్యాంకర్ డిండోరీ ర‌హ‌దారి గుండా వెళుతోంది. అదే స‌మ‌యంలో అది అదుపు త‌ప్పడంతో ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది. ఈ విష‌యాన్ని తెలుసుకున్న స్థానికులు పెద్ద ఎత్తున డబ్బాలను చేత ప‌ట్టుకుని ప‌రుగుప‌రుగున వ‌చ్చారు. బోల్తా పడిన ట్యాంకర్‌లో నుంచి కిరోసిన్‌ను తీసుకెళ్లారు. ఈ ఘ‌ట‌న‌కు సంబంధించిన వీడియోను మీరూ చూడండి...        

   


More Telugu News