sunil: సునీల్ '2 కంట్రీస్' ఫస్టులుక్ రిలీజ్

  • సునీల్ తాజా చిత్రంగా '2 కంట్రీస్'
  • ఈ సినిమా నుంచి రిలీజ్ చేసిన ఫస్టులుక్ 
  • సునీల్ సరసన మనీషా .. సంజనా గల్రాని 
  • ఈ మూవీపై నమ్మకం పెట్టుకున్న సునీల్  

హీరోగా సరైన హిట్ కొట్టడానికి సునీల్ తనవంతు ప్రయత్నాలు చేస్తూనే వున్నాడు. అందులో భాగంగానే ఈ మధ్య 'ఉంగరాల రాంబాబు' ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా కూడా ఆడియన్స్ నుంచి ఓ మాదిరి రెస్పాన్స్ నే రాబట్టుకోగలిగింది. ఇక ఆ తరువాత సినిమాగా ఎన్. శంకర్ దర్శకత్వంలో సునీల్ 'టూ కంట్రీస్' సినిమా చేశాడు. 2015లో మలయాళంలో వచ్చిన 'టూ కంట్రీస్'కి ఇది రీమేక్.

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పార్టును పూర్తి చేసుకుని, పోస్టు ప్రొడక్షన్ పనులను జరుపుకుంటోంది. తాజాగా ఈ సినిమా నుంచి ఫస్టులుక్ ను రిలీజ్ చేశారు. కథానాయికతో కలిసి హీరో సరదాగా కబుర్లు చెబుతూ నడుచుకుంటూ వస్తున్నాడు. ఈ పోస్టర్ ఆహ్లాదకరంగా అనిపిస్తోంది. ఈ సినిమాలో సునీల్ సరసన మనీషా .. సంజనా గల్రాని నటించారు. ఈ సినిమాతో తనకి తప్పకుండా హిట్ పడుతుందనే నమ్మకంతో సునీల్ వున్నాడు. ఆయన నమ్మకాన్ని ఈ సినిమా ఎంతవరకూ నిలబెడుతుందో చూడాలి మరి.    

More Telugu News