shivaji raja: మోహన్ బాబు గారు అలా అనడంతో ఒక్కసారిగా ఉలిక్కి పడ్డాను: శివాజీరాజా

  • మోహన్ బాబు గారు అంటే నా కెంతో ఇష్టం 
  • ఆయన నన్నెంతో అభిమానంతో చూసుకునేవారు 
  • అలాంటి ఆయన ఆ మాట అనేశారు 
  • అదీ అనుకోకుండా అనేసిందే!  

తాజాగా ఐ డ్రీమ్స్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో శివాజీరాజా మాట్లాడుతూ .. మోహన్ బాబుతో తనకి గల అనుబంధాన్ని గురించి ప్రస్తావించారు. " మోహన్ బాబు గారు అంటే నా కెంతో ఇష్టం. ఆయన నన్నెంతో అభిమానంతో చూసుకునేవారు. అప్పట్లో ఆయన ఎక్కడికి వెళుతున్నా నన్ను తీసుకెళుతుండేవారు. అలాంటి మోహన్ బాబు గారు ఓసారి నేనుండగా పక్కనున్న వాళ్లతో మాట్లాడుతూ .. "శివాజీ రాజా .. చిరంజీవికి తొత్తయ్యా .. " అనేశారు. ఆ మాట కూడా ఆయన అనుకోకుండా అనేసిందే. ఇదేంటి ఈయన ఇంత మాట అనేశారు అనుకుని చాలా బాధ పడ్డాను"

"నేను చిరంజీవి అభిమానిని .. ఆ విషయం అందరికీ తెలిసిందే. అంతకుముందు కృష్ణగారి అభిమానిని .. మోహన్ బాబుగారి అభిమానిని. విచిత్రమేమిటంటే ఇటు చిరంజీవి ఫ్యామిలీకి సంబంధించిన హీరోలతో గానీ, అటు మోహన్ బాబు ఫ్యామిలీకి సంబంధించిన హీరోలతో గాని నేను సినిమాలు చేయలేదు. 'తొత్తు' అంటే స్నేహం అనే మీనింగ్ తో ఏమైనా అన్నారేమో మరి .. తెలియదు" అంటూ ఆనాటి సంఘటనను గురించి చెప్పుకొచ్చారు.     

More Telugu News