Cricket: తొలి ఓవర్.. తొలి బంతికే టీమిండియాకు ఎదురుదెబ్బ‌!

  • మొద‌టి వికెట్ కోల్పోయిన టీమిండియా
  • ఓపెన‌ర్ లోకేశ్ రాహుల్ ఔట్‌
  • టీమిండియా స్కోరు మొద‌టి ఓవ‌ర్ ముగిసే నాటికి 0

కోల్‌క‌తాలోని ఈడెన్ గార్డెన్స్‌లో జ‌రుగుతోన్న భార‌త్, శ్రీలంక మొదటి టెస్టు మ్యాచులో టాస్ గెలిచిన శ్రీలంక మొద‌ట బౌలింగ్ ఎంచుకున్న విష‌యం తెలిసిందే. బ్యాటింగ్ ప్రారంభించిన టీమిండియా తొలి ఓవర్ తొలి బంతికే వికెట్ కోల్పోయింది. సురంగ నక్మ‌ల్ బౌలింగ్‌లో టీమిండియా ఓపెన‌ర్ లోకేశ్ రాహుల్ అవుట‌య్యాడు. ప్ర‌స్తుతం క్రీజులో శిఖ‌ర్ ధావ‌న్ (0), ఛ‌టేశ్వ‌ర్ పుజారా (0) ఉన్నారు. మొద‌టి ఓవ‌ర్ ముగిసే స‌మ‌యానికి టీమిండియా ఒక్క ప‌రుగు కూడా చేయ‌లేదు.

More Telugu News