ramdev baba: రాందేవ్ బాబాతో టీఆర్ఎస్ ఎంపీ కవిత భేటీ

  • రాందేవ్ బాబా, బాలకృష్ణ లతో సమావేశం
  • నిజామాబాద్ జిల్లాలో పతంజలి కేంద్రం ఏర్పాటుపై చర్చ
  • భేటీకి హాజరైన పలువురు నేతలు

ప్రముఖ యోగా గురు రాందేవ్ బాబా, పతంజలి ఉత్పత్తుల సంస్థ సీఈవో బాలకృష్ణతో నిజామాబాద్ టీఆర్ఎస్ ఎంపీ కల్వకుంట్ల కవిత ఢిల్లీలో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా నిజామాబాద్ జిల్లా లక్కంపల్లి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ లో పతంజలి ఉత్పత్తుల కేంద్రం ఏర్పాటుపై వీరి మధ్య చర్చ జరిగింది.

ఈ భేటీకి ఎమ్మెల్యే జీవన్ రెడ్డితోపాటు, నందిపేట్ మండలానికి చెందిన పలువురు ప్రజాప్రతినిధులు కూడా హాజరయ్యారు. మరోవైపు, వ్యాపార విస్తరణలో భాగంగా పతంజలి సంస్థ దేశంలోని పలు ప్రాంతాల్లో తమ ఉత్పాదక కేంద్రాలను నెలకొల్పుతోంది. ఏపీలో కూడా ఒక కేంద్రాన్ని ప్రారంభించబోతోంది.

More Telugu News