KCR: ఏపీ టీడీపీ నేత పయ్యావుల కేశవ్ తనను కలిసిన కారణాన్ని ఫేస్ బుక్ లో స్వయంగా చెప్పిన కేసీఆర్!

  • తన ఇంట పెళ్లికి కేసీఆర్ ను ఆహ్వానించిన పయ్యావుల
  • స్వయంగా వచ్చి ఆహ్వాన పత్రికను అందించిన వైనం 
  • ఫేస్ బుక్ లో ఫోటోను పంచుకున్న కేసీఆర్

ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్సీ, తెలుగుదేశం పార్టీ నేత పయ్యావుల కేశవ్, కేసీఆర్ ను కలిశారు. కేసీఆర్ ఇంటికి వెళ్లిన ఆయన, దాదాపు పావుగంట పాటు అక్కడే ఉన్నారు. ఇక పయ్యావుల తనను ఎందుకు కలిశారన్న విషయాన్ని కేసీఆర్, తన ఫేస్ బుక్ ఖాతాలో స్వయంగా వెల్లడించారు. తన కుటుంబంలో జరిగే పెళ్లికి ఆహ్వానించేందుకు ఆయన వచ్చారని తెలిపారు.

కాగా, అనంతపురం జిల్లాలో జరిగిన పరిటాల శ్రీరామ్ పెళ్లికి వెళ్లినప్పుడు, హెలిపాడ్ వద్ద పయ్యావుల కేశవ్ ను స్వయంగా పిలిపించుకున్న కేసీఆర్, ఆయనతో కాసేపు మాట్లాడిన సంగతి తెలిసిందే. ఈ విషయంపై విమర్శలు కూడా వెల్లువెత్తాయి. పయ్యావులకు, కేసీఆర్ కు మధ్య వ్యాపార సంబంధాలున్నాయని, తెలంగాణలో కాంట్రాక్టులను పొందారని, టీడీపీకి రాజీనామా చేసిన తరువాత రేవంత్ రెడ్డి ఆరోపించారు.

  • Loading...

More Telugu News