actor naresh: ఏపీ ప్రభుత్వానికి కృతజ్ఞతలు చెప్పుకున్న సీనియర్ నరేష్

  • శతమానంభవతి, పరంపర చిత్రాలకుగాను నరేష్ కు అవార్డులు
  • దివంగత జంధ్యాలకు అంకితం ఇస్తున్నా
  • ట్విట్టర్ లో వెల్లడించిన నరేష్

ఒకే వేదికపై తనకు రెండు నంది అవార్డులను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించడం పట్ల సీనియర్ నటుడు నరేష్ తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు. ఈ అవార్డులను తన గురువు, దర్శకుడు జంధ్యాలకు అంకితం ఇస్తున్నానని, తన ప్రతి విజయం వెనుకా ఆయన ఉన్నారని అన్నాడు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు పెట్టాడు.

కాగా, 2016లో 'శతమానంభవతి' చిత్రానికి, 2014లో 'పరంపర' చిత్రానికిగాను అవార్డులు లభించిన విషయం తెలిసిందే. వీటితో పాటు దిగ్గజ నటుడు ఎస్వీ రంగారావు పేరిట ఇచ్చే అవార్డుకు కూడా నరేష్ ఎంపికయ్యాడు. ఆ ఆనందంలో ఉన్న నరేష్ ఏపీ ప్రభుత్వానికి ట్విట్టర్ ద్వారా కృతజ్ఞతలు చెప్పాడు.ఈ అవార్డులతో తనకు అరుదైన గౌరవం లభించినట్లయిందని అన్నాడు.

  • Loading...

More Telugu News