mahesh kathi: ప‌వ‌న్ క‌ల్యాణ్‌కు అన్నీ తెలుసు.. కావాల‌నే స్పందించ‌డం లేదు: మ‌హేశ్ క‌త్తి ఆగ్ర‌హం

  • గ‌తంలో ప‌వ‌న్ ఫ్యాన్స్ న‌న్ను బెదిరించారు
  • త‌న అభిమానులు చేస్తోన్న వికృత చేష్ట‌లు జ‌న‌సేనానికి తెలుసు
  • ఇలా జ‌ర‌గాల‌నే ఆయ‌న కోరుకుంటున్నారు
  • కావాల‌నే ఖండించ‌డం లేదు

గ‌తంలో త‌న‌ను సినీన‌టుడు ప‌వ‌న్ క‌ల్యాణ్ అభిమానులు బెదిరించిన‌ప్పుడు మీడియా ముందుకు వ‌చ్చి జ‌న‌సేనాని స్పందించాల‌ని కోరాన‌ని సినీ విశ్లేష‌కుడు మ‌హేశ్‌క‌త్తి చెప్పారు. అయితే, ఎప్పుడూ తాను సేఫ్ జోన్‌లోనే ఉండాల‌ని కోరుకునే ప‌వ‌న్ కల్యాణ్ అస్స‌లు స్పందించ‌లేద‌ని విమ‌ర్శించారు. దాన్ని బ‌ట్టి త‌న‌కు ప‌వ‌న్ క‌ల్యాణ్ మ‌న‌స్త‌త్వం మ‌రింత అర్థ‌మైంద‌ని చెప్పారు.

'జ‌బ‌ర్ద‌స్త్' కామెడీ షోలో మ‌నుషుల రంగు, రూపం గురించి జోక్‌లు వేస్తూ హేళ‌న చేస్తున్నారంటూ హైప‌ర్ ఆదిపై మ‌హేశ్ క‌త్తి మండిప‌డ్డ విష‌యం తెలిసిందే. ఈ అంశంపై చర్చించ‌డానికి ప్రముఖ‌ న్యూస్ ఛానెల్ టీవీ9 స్టూడియోకి ఆయ‌న వెళ్లారు. ఈ నేప‌థ్యంలో జ‌బ‌ర్ద‌స్త్ షోపై విమ‌ర్శ‌లు చేస్తూ ప‌వ‌న్ క‌ల్యాణ్ అంశంపై కూడా స్పందించారు.

త‌న అభిమానులు చేస్తోన్న వికృత చేష్ట‌ల‌ను ప‌వ‌న్ క‌ల్యాణ్ ప్రోత్స‌హిస్తున్నాడ‌ని మ‌హేశ్ క‌త్తి అన్నారు. త‌న అభిమానులు చేస్తోన్న ప‌నుల‌ను ఖండించ‌కుండా, వాటిపై ఏమీ మాట్లాడ‌కుండా సైలెంటుగా ఉంటూ ప్రోత్స‌హిస్తున్నార‌ని చెప్పారు. చివ‌రికి త‌న అభిమానులు చేస్తోన్న ప‌నులు త‌న‌కు తెలియ‌వ‌ని ప‌వ‌న్ క‌ల్యాణ్ చెప్పుకుంటార‌ని మ‌హేశ్ క‌త్తి ఆరోపించారు. ఖండించ‌డం పెద్ద విష‌యం ఏమీకాద‌ని, అంత చిన్న ప‌నిని ఆయ‌న ఎందుకు చేయడం లేద‌ని అన్నారు. ఇటువంటివి జ‌ర‌గాల‌న్నదే ప‌వ‌న్ క‌ల్యాణ్ అస‌లు ఉద్దేశ‌మ‌ని చెప్పారు.   

More Telugu News