ys jagan: భయాన్ని బయటకు కనిపించనీయకుండా మేనేజ్ చేస్తున్నారు: జగన్ పై యనమల విసుర్లు

  • ప్యారడైజ్ పేపర్లలో పేరు రావడంతో భయం పట్టుకుంది
  • ప్రజలకు కనిపించకుండా మేనేజ్ చేస్తున్నారు
  • సీబీఐ చేత విచారణ జరిపించాలి

వైసీపీ అధినేత జగన్ పై ఏపీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు విమర్శలు గుప్పించారు. ప్యారడైజ్ పేపర్ల ద్వారా జగన్ సరికొత్త అవినీతి వెలుగులోకి వచ్చిందని అన్నారు. ఈ పేపర్లలో పేరు బయటపడటంతో జగన్ కు భయం పట్టుకుందని చెప్పారు. అయితే పాదయాత్ర చేస్తుండటంతో, తనలోని భయం ప్రజలకు కనిపించకుండా జగన్ మేనేజ్ చేస్తున్నారని ఎద్దేవా చేశారు. ప్యారడైజ్ పేపర్లలో వచ్చిందంతా అబద్ధమని ప్రచారం చేసుకుంటున్నారని విమర్శించారు. ఈ సరికొత్త విషయాలపై సీబీఐ విచారణ జరగాలని డిమాండ్ చేశారు. 

More Telugu News