Amalapaul: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం!

  • 'దొంగోడొచ్చాడు' అంటున్న అమలా పాల్! 
  • చివరి దశ షూటింగులో నాని 'ఎంసిఏ'
  • వెంకటేశ్ తో కలవనున్న మెగా హీరో!
  • పొల్లాచ్చి వెళుతున్న మహేశ్ బాబు    

*  అమలాపాల్, బాబీ సింహా, ప్రసన్న ప్రధాన పాత్రల్లో నటించిన 'తిరుట్టు పయలే 2' చిత్రాన్ని తెలుగులోకి 'దొంగోడొచ్చాడు' పేరుతో అనువదిస్తున్నారు. తమిళంలో ఈ చిత్రాన్ని ఈ నెల 30న రిలీజ్ చేస్తుండగా, తెలుగులో మాత్రం డిసెంబర్ రెండో వారంలో విడుదల చేస్తామని నిర్మాతలు తెలిపారు. సుశీ గణేష్ దీనికి దర్శకత్వం వహిస్తున్నాడు.
*  నాని, సాయిపల్లవి హీరో హీరోయిన్లుగా రూపొందుతున్న 'ఎంసిఏ' (మిడిల్ క్లాస్ అబ్బాయి) చిత్రం షూటింగ్ చివరి దశకు చేరింది. ప్రస్తుతం హైదరాబాదులో షూటింగ్ చేస్తున్నారు. మరోపక్క, పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా మొదలయ్యాయి. వేణు శ్రీరాం దీనికి దర్శకత్వం వహిస్తున్నాడు.
*  సీనియర్ నటుడు వెంకటేశ్, సాయిధరం తేజ్ కలయికలో ఓ మల్టీ స్టారర్ నిర్మించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించే ఈ చిత్రానికి 'ఎఫ్ 2' (ఫన్ & ఫ్రస్ట్రేషన్) అనే పేరును అనుకుంటున్నారు.        
*  మహేశ్ బాబు, కొరటాల శివ కాంబినేషన్లో రూపొందుతున్న 'భరత్ అను నేను' చిత్రం తదుపరి షెడ్యూలు షూటింగ్ త్వరలో ప్రారంభమవుతుంది. ఈ షెడ్యూలును తమిళనాడులోని పొల్లాచ్చిలో నిర్వహించడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇందులో బాలీవుడ్ భామ కైరాఅద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది.      
 

More Telugu News