KCR: 51 పొటేళ్లతో దర్గా మొక్కు తీర్చుకోనున్న కేసీఆర్!

  • ఈ మధ్యాహ్నం జహంగీర్ పీర్ దర్గాకు కేసీఆర్
  • పొటేళ్లను సమర్పించనున్న సీఎం
  • ఉద్యమం వేళ మొక్కుకున్న కేసీఆర్
  • నాలుగేళ్ల తరువాత తీర్చుకుంటున్న వైనం

ప్రత్యేక తెలంగాణ రావాలని కోరుకుంటూ, ఉద్యమం జరుగుతున్న వేళ పలు దేవుళ్లకు మొక్కులు మొక్కుకున్న కేసీఆర్, ఇప్పుడు వాటిని ఒక్కొక్కటిగా తీర్చుకుంటూ వస్తున్నారు. ఈ క్రమంలో రంగారెడ్డి జిల్లా జహంగీర్ పీర్ దర్గాకు ఈ మధ్యాహ్నం వెళ్లి, ఉద్యమ సమయంలో అక్కడ మొక్కిన మొక్కులు తీర్చుకోనున్నారు.

దర్గా వద్ద 51 పొటేళ్లతో కేసీఆర్ మొక్కు తీర్చుకోనున్నారు. జహంగీర్ పీర్ దర్గాలో మొక్కులు మొక్కుకున్న నాలుగేళ్ల తరువాత వాటిని కేసీఆర్ తీర్చుకోనుండటం గమనార్హం. కేసీఆర్ రాక సందర్భంగా దర్గా వద్ద బందోబస్తును పెంచారు. ఈ ప్రాంతాన్ని పోలీసులు తమ అధీనంలోకి తీసుకున్నారు.

More Telugu News