Adasharma: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం!

  • ప్రభుదేవా సినిమాలో నాయికగా ఆదాశర్మ 
  • వచ్చే నెలలో సునీల్ '2 కంట్రీస్'
  • లాయర్ వేషంలో వస్తున్న తాప్సీ 
  • మరో రీమేక్ సినిమాలో నిఖిల్

*  ఆమధ్య 'క్షణం' సినిమాలో నటించిన ఆదాశర్మ తొలిసారిగా తమిళ చిత్రంలో కథానాయికగా నటిస్తోంది. ప్రభుదేవా నిర్మిస్తున్న 'చార్లీ చాప్లిన్ 2' చిత్రంలో ఆదాశర్మ ప్రధాన నాయిక పాత్రకు ఎంపికైంది. దీనికి శక్తి చిదంబరం దర్శకత్వం వహిస్తున్నాడు.
*  ప్రముఖ దర్శకుడు ఎన్.శంకర్ దర్శకత్వంలో హాస్య కథానాయకుడు సునీల్ హీరోగా మలయాళంలో హిట్టయిన '2 కంట్రీస్' చిత్రాన్ని రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ చిత్రానికి కూడా '2 కంట్రీస్' అనే పేరునే ఖరారు చేశారు. మనీషా రాజ్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని వచ్చే నెలలో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.
*  ఇటీవల తెలుగులో 'ఆనందో బ్రహ్మ', హిందీలో 'జుడ్వా 2' చిత్రాలతో విజయాలను సొంతం చేసుకున్న అందాల తాప్సీ తాజాగా అనుభవ్ సిన్హా దర్శకత్వంలో రూపొందుతున్న 'ముల్క్' అనే చిత్రంలో నటిస్తోంది. ఇందులో ఈ చిన్నది లాయర్ పాత్రను పోషిస్తోంది.
*  ప్రస్తుతం 'కిరీక్ పార్టీ' రీమేక్ లో నటిస్తున్న యంగ్ హీరో నిఖిల్ మరో రీమేక్ లో నటించనున్నాడు. తమిళంలో హిట్టయిన 'కనిథన్' చిత్రాన్ని ఠాగూర్ మధు తెలుగులో రీమేక్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఇందులో నిఖిల్ నటిస్తాడని సమాచారం.  

More Telugu News