jagan: రాజన్న మాదిరిగా రాజ్యమేలాలని ఓ పెద్దాయన అంటే... జగన్ స్పందన ఇది!

  • జగన్ కోసం 12 కి.మీ నడిచి వచ్చిన వృద్ధ దంపతులు
  • తన వద్దకు వచ్చిన దంపతుల క్షేమ సమాచారాలు అడిగిన జగన్
  • ఆశీస్సులు కావాలని కోరిన వైకాపా అధినేత

వైకాపా అధినేత వైఎస్ జగన్ ప్రజా సంకల్పయాత్ర పేరిట పాదయాత్ర చేస్తున్న వేళ, కడప జిల్లా రాయచోటి సమీపంలో ఓ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. పాచంపల్లె సమీపంలోని కీర్తిరెడ్డి పల్లెకు చెందిన వృద్ధ దంపతులు ఓబుళయ్య, లక్ష్మమ్మలు జగన్ ను చూసేందుకు ఎండవేడిని సైతం లెక్కచేయకుండా 12 కిలోమీటర్ల దూరం నడిచి, సంగాలపల్లె క్రాస్ రోడ్డు వద్ద జగన్ కు ఎదురువచ్చారు.

ఆ దంపతులకు జగన్ ను కలిసే అవకాశం గంగిరెడ్డి పల్లె వద్ద లభించింది. జగన్ ను ఆప్యాయంగా పలకరించిన పెద్దాయన, "రాజన్న మాదిరిగా నువ్వూ రాజ్యమేలితే మాలాంటి వారందరికీ మేలు కలుగుతుంది" అన్నాడు. ఈ వ్యాఖ్యలపై స్పందించిన జగన్, మీవంటి పెద్దల ఆశీస్సులు తనకు కావాలని కోరారు. వారిని ఆప్యాయంగా పలకరించి, సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

More Telugu News