allu shirish: అల్లు శిరీశ్ సైన్టిఫిక్ థ్రిల్లర్ టైటిల్ గా 'ఒక్క క్షణం'

  • అల్లు శిరీష్ హీరోగా సైన్టిఫిక్ థ్రిల్లర్ 
  • దర్శకుడిగా వి.ఐ. ఆనంద్ 
  • కథానాయికలుగా సురభి, శీరత్ కపూర్    

'ఎక్కడికి పోతావు చిన్నవాడా'తో దర్శకుడిగా వి.ఐ. ఆనంద్ తన సత్తా చాటుకున్నాడు. ఆయన టాలెంట్ ను గుర్తించిన అల్లు అరవింద్ .. ఓ ఛాన్స్ ఇచ్చాడు. అప్పటి నుంచి అల్లు శిరీష్ హీరోగా ఒక సినిమా రూపొందుతోంది. సైన్టిఫిక్ థ్రిల్లర్ గా వి.ఐ.ఆనంద్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన చిత్రీకరణ చాలా వరకూ పూర్తయింది.

కంటెంట్ కి తగిన విధంగా ఈ సినిమాకి 'ఒక్క క్షణం' అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారట. దాదాపు ఇదే టైటిల్ ఖరారు కావొచ్చని అంటున్నారు. చక్రి చిగురుపాటి నిర్మిస్తోన్న ఈ సినిమా, ప్రస్తుతం బెంగుళూర్ లో షూటింగ్ జరుపుకుంటోంది. ప్రధానమైన పాత్రలకి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన సన్నివేశాలను అక్కడ చిత్రీకరిస్తున్నారట. అల్లు శిరీష్ సరసన సురభి .. శీరత్ కపూర్ కథానాయికలుగా అలరించనున్నారు.    

  • Loading...

More Telugu News