Virat Kohli: టీ 20లో బ్యాటింగ్‌లో కోహ్లీ, బౌలింగ్‌లో బూమ్రా నెంబర్ 1

  • ర్యాంకులు మెరుగుప‌ర్చుకున్న రోహిత్ శ‌ర్మ‌, శిఖ‌ర్ ధావ‌న్
  • ఆరోన్ ఫించ్ కంటే కోహ్లీకి 40 పాయింట్లు అధికం
  • టీ 20 జ‌ట్టు ర్యాంకింగ్స్‌లో పాక్ నెం.1, భార‌త్ నెం.5

ఐసీసీ ఈ రోజు విడుద‌ల చేసిన టీ20 ర్యాంకింగ్స్‌లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మ‌రోసారి అగ్ర‌స్థానంలో నిలిచాడు. మ‌రోవైపు టీమిండియా ఓపెన‌ర్లు రోహిత్ శ‌ర్మ‌, శిఖ‌ర్ ధావ‌న్ త‌మ ర్యాంకుల‌ను మెరుగుప‌ర్చుకున్నారు. న్యూజిలాండ్‌తో జ‌రిగిన‌ మూడు టీ20ల్లో కలిపి కోహ్లీ 104 ప‌రుగులు చేశాడు. దీంతో ఇప్ప‌టికే అగ్ర‌స్థానంలో ఉన్న కోహ్లీ మ‌రో 13 పాయింట్లు సాధించి రెండో స్థానంలో ఉన్న ఆస్ట్రేలియా క్రికెట‌ర్ ఆరోన్ ఫించ్ పాయింట్ల క‌న్నా మ‌రిన్ని పాయింట్ల‌ను మెరుగుపర్చుకున్నాడు.

ఆరోన్ ఫించ్ (784) క‌న్నా కోహ్లీకి (824) 40 పాయింట్లు అధికంగా ఉన్నాయి. ఇక రోహిత్‌ శర్మ మూడు స్థానాలు మెరుగు ప‌ర్చుకుని 21వ‌ స్థానానికి, శిఖ‌ర్‌ ధావన్‌ 20 స్థానాలు మెరుగుప‌ర్చుకుని 45వ ర్యాంకులో నిలిచారు. బౌలింగ్‌ విభాగంలో టీ20ల్లో భార‌త బౌల‌ర్‌ జస్ప్రీత్‌ బుమ్రా 724 పాయింట్లతో మొద‌టి స్థానంలో ఉన్నాడు. భువనేశ్వర్‌ కుమార్ 26 వ స్థానంలో నిల‌వ‌గా, యజ్వేంద్ర చాహల్ 30వ ర్యాంకులో, అక్స‌ర్‌ పటేల్‌ 62వ స్థానంలో నిలిచారు.    

More Telugu News