nagachaitanya: డిఫరెంట్ కాన్సెప్ట్ తో రంగంలోకి దిగిన 'సవ్యసాచి' .. ఈ రోజు నుంచే షూటింగ్ మొదలు

  • నాగచైతన్య హీరోగా 'సవ్యసాచి'
  • మళ్లీ 'ప్రేమమ్' దర్శకుడికే ఛాన్స్ 
  • సంగీత దర్శకుడిగా కీరవాణి 
  • కథానాయికగా నిధి అగర్వాల్  

నాగచైతన్య కథానాయకుడిగా చందూ మొండేటి ఒక సినిమాను తెరకెక్కించనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి 'సవ్యసాచి' అనే టైటిల్ ను కూడా ఖరారు చేశారు. ఈ రోజునే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలవుతోంది. హైదరాబాద్ లో జరగనున్న ఈ మొదటి షెడ్యూల్లో కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను ప్లాన్ చేశారట.

 ఈ సినిమాలో హీరో పాత్ర ఎలా వుంటుందనే విషయాన్ని గురించి చందూ చెప్పినప్పటి నుంచి అందరిలో ఆసక్తి నెలకొంది. గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్లో వచ్చిన 'ప్రేమమ్' ఘన విజయాన్ని సాధించడం వలన, ఈ కాంబినేషన్ పై అంచనాలు వున్నాయి. యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతోన్న ఈ సినిమాకి, మైత్రీ మూవీస్ వారు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. కీరవాణి సంగీతాన్ని అందిస్తోన్న ఈ సినిమాలో, నిధి అగర్వాల్ కథానాయికగా కనిపించనుంది.        

  • Loading...

More Telugu News