saiPallavi: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం!

  • మళ్లీ డబ్బింగ్ మొదలెట్టిన సాయి పల్లవి
  • విజయ్ కెరీర్లో ఇదో పెద్ద రికార్డు 
  • మనోజ్ చిత్రానికి నారా రోహిత్ వాయిస్ ఓవర్ 
  • ఆడియో వేడుకకి సిద్ధమవుతున్న 'బాలకృష్ణుడు'


*  'ఫిదా' సినిమాతో తెలుగులో బాగా పేరు తెచ్చుకున్న కథానాయిక సాయిపల్లవి ప్రస్తుతం 'మిడిల్ క్లాస్ అబ్బాయి' (ఎం.సి.ఏ) చిత్రంలో నటిస్తోంది. విశేషం ఏమిటంటే, 'ఫిదా'కి డబ్బింగ్ చెప్పుకున్న ఈ చిన్నది ఇప్పుడు 'ఎం.సి.ఏ'కి కూడా డబ్బింగ్ చెబుతోంది.  
*  తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన తాజా చిత్రం 'మెర్సల్' భారీ విజయాన్ని సొంతం చేసుకున్న సంగతి విదితమే. ఇక ఇంతవరకు ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా 220 కోట్ల గ్రాస్ వసూలు చేసి విజయ్ కెరీర్లో నెంబర్ వన్ చిత్రంగా నిలిచింది. అట్లీ కుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం తెలుగులో 'అదిరింది' పేరిట వచ్చింది.  
*  మంచు మనోజ్ హీరోగా అజయ్ ఆండ్రూస్ నూతక్కి దర్శకత్వంలో రూపొందిన 'ఒక్కడు మిగిలాడు' చిత్రం కోసం హీరో నారా రోహిత్ వాయిస్ ఓవర్ చెప్పాడు. అనీషా ఆంబ్రోస్ కథానాయికగా నటించిన ఈ చిత్రాన్ని ఈ నెల 10న రిలీజ్ చేస్తున్నారు.  
*  నారా రోహిత్ హీరోగా నటించిన 'బాలకృష్ణుడు' చిత్రం ఆడియో వేడుకను ఈ నెల 10న హైదరాబాదులో నిర్వహిస్తారు. పవన్ మల్లెల దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని ఈ నెల 24న విడుదల చేస్తారు. ఇందులో రెజీనా నాయికగా నటించింది.  

More Telugu News