sandeep kishan: ఇది డబ్బింగ్ సినిమా కాదు .. నేను పరాయివాడినీ కాదు!: సందీప్ కిషన్

  • 'కేరాఫ్ సూర్య' అచ్చమైన తెలుగు సినిమా
  • తెలుగుతో పాటే తమిళంలో చిత్రీకరించాం 
  • నిజం చెప్పడానికి వెనుకాడను
  • నన్ను వేరుగా చూడటం బాధ కలిగిస్తోంది

మాస్ ఆడియన్స్ లో సందీప్ కిషన్ కి మంచి గుర్తింపు వుంది. తెలుగు .. తమిళ భాషల్లో ఆయన వరుస సినిమాలు చేస్తూ వెళుతున్నాడు. ఆయన తాజా చిత్రంగా 'కేరాఫ్ సూర్య' ఈ నెల 10వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఇండస్ట్రీలోని కొంతమంది దీనిని డబ్బింగ్ సినిమాగా ప్రస్తావించడం గురించి సందీప్ కిషన్ ఎమోషనల్ అయ్యాడు.

ఈ మధ్య తాను ఎక్కువగా తమిళ సినిమాలు చేస్తుండటం వలన తనని పరాయివాడిగా భావిస్తున్నారనీ, 'కేరాఫ్ సూర్య' సినిమాను డబ్బింగ్ సినిమా అని అంటున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశాడు. నిజంగా డబ్బింగ్ సినిమా అయితే ఆ విషయం చెప్పడానికి తాను ఎంత మాత్రం ఆలోచించననీ, కానీ ఈ సినిమాను తెలుగు .. తమిళ భాషల్లో ఒకేసారి తెరకెక్కించడం జరిగిందని అన్నాడు. ఇది అచ్చమైన తెలుగు సినిమా అనడంలో ఎంతమాత్రం సందేహం లేదనీ, ద్విభాషా చిత్రాలను చేస్తోన్న తనని ఇలా పరాయివాడిగా చూడటం కరెక్ట్ కాదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. 

More Telugu News