Kamal Haasan: త‌మిళ‌నాడు రాష్ట్ర ప‌ర్య‌ట‌న చేస్తా: క‌మ‌ల‌హాస‌న్ ప్ర‌క‌ట‌న‌

  • త‌న పుట్టిన రోజు సంద‌ర్భంగా మీడియా ముందుకు క‌మ‌ల్‌
  • స‌రైన స‌మ‌యంలో కొత్త పార్టీ ప్ర‌క‌టన‌ ఉంటుంది
  • ప్ర‌జాస‌మ‌స్య‌ల‌ను తెలుసుకుంటాను
  • యాప్ ద్వారా ప్ర‌జ‌లు త‌మ అభిప్రాయాల‌ను చెప్ప‌వ‌చ్చు

రాజ‌కీయాల్లోకి వ‌స్తాన‌ని ఇప్ప‌టికే ప్ర‌క‌టించిన సినీన‌టుడు క‌మ‌ల‌ హాస‌న్ ఈ రోజు త‌న పుట్టిన రోజు సంద‌ర్భంగా మీడియా ముందుకు వ‌చ్చారు. స‌రైన స‌మ‌యంలో త‌న కొత్త పార్టీ ప్ర‌క‌టన‌ ఉంటుంద‌ని చెప్పారు. ముందుగా తాను ప్ర‌జాస‌మ‌స్య‌ల‌ను తెలుసుకుంటానని చెప్పుకొచ్చారు. అందుకోసం త‌మిళ‌నాడు ప‌ర్య‌ట‌న చేస్తాన‌ని చెప్పారు. క్షేత్ర‌స్థాయిలో ప‌ర్య‌టిస్తేనే ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు తెలుసుకోవ‌చ్చని పేర్కొన్నారు. పార్టీ ప్ర‌క‌ట‌నకు ముందే ప్ర‌జ‌ల‌తో అనుసంధానం అవ‌స‌ర‌మ‌ని భావిస్తున్నానని అన్నారు.

రాజ‌కీయాల‌క‌న్నా త‌న‌కు ప్ర‌జ‌లే ముఖ్య‌మ‌ని క‌మ‌ల‌హాస‌న్ అన్నారు. మంచిపనులు చేసేందుకు రాజ‌కీయాల్లోకి వ‌స్తున్నాన‌ని చెప్పారు. పార్టీని బ‌ల‌మైన పునాదులతో ఏర్పాటు చేసుకుంటాన‌ని వ్యాఖ్యానించారు. ఈ సంద‌ర్భంగా క‌మ‌ల‌హాస‌న్ ‘మియామ్ విజిల్’ (Maiyam-Whistle) యాప్‌ను విడుద‌ల చేశారు. ఆ యాప్ ద్వారా ప్ర‌జ‌లు త‌మ అభిప్రాయాల‌ను చెప్ప‌వ‌చ్చ‌ని సూచించారు.

More Telugu News