chiranjeevi: చిరంజీవి ఇంట్లో దొంగిలించిన డబ్బుతో తానేం చేశాడో చెప్పిన చెన్నయ్య!

  • రెండు చోట్ల ప్లాట్లు కొనుగోలు చేసిన దొంగ
  • పోలీసు విచారణలో వెల్లడి
  • ప్లాట్ల పత్రాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు

గత వారంలో చిరంజీవి ఇంటి నుంచి డబ్బు దొంగిలించుకుని పారిపోయి, పోలీసులకు పట్టుబడిన దొంగ చెన్నయ్య, పోలీసుల విచారణలో పలు కీలక విషయాలను వెల్లడించినట్టు తెలుస్తోంది. చిరంజీవి ఇంట్లో తాను మొదటిసారి దొంగతనం చేయలేదని, గతంలోనూ చాలాసార్లు ఇదే పని చేశానని చెన్నయ్య చెప్పినట్టు పోలీసు వర్గాలు వెల్లడించాయి.

చిరంజీవి ఇంట్లో దొంగిలించిన డబ్బుతో తాను రెండు చోట్ల ప్లాట్లు కొనుగోలు చేశానని ఆయన చెప్పాడట. గతంలో వాటికి అడ్వాన్సులు ఇచ్చానని, ఇప్పుడు పూర్తి డబ్బు ఇవ్వాల్సి వచ్చినందున మరోసారి దొంగతనానికి ప్రయత్నించానని చెప్పినట్టు తెలుస్తోంది. ఇక చెన్నయ్య వాంగ్మూలాన్ని నమోదు చేసిన పోలీసులు ప్లాట్ల పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. కేసు విచారణ కొనసాగుతోందని పోలీసు వర్గాలు వెల్లడించాయి.

కాగా, చాలా సంవత్సరాల నుంచి చిరంజీవి ఇంట్లో పనిచేస్తున్న చెన్నయ్య, దొంగతనం చేసి పారిపోయినట్టు చిరంజీవి ఇంటి మేనేజర్ ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు రంగంలోకి దిగిన సంగతి తెలిసిందే. 

More Telugu News