Cash For Vote: ఓటుకు నోటు కేసులో మ‌రో కీల‌క ప‌రిణామం.. వైసీపీ ఎమ్మెల్యే పిటిషన్ ను స్వీకరించిన సుప్రీం!

  • ఓటుకు నోటు కేసును సీబీఐతో ద‌ర్యాప్తు చేయించాల‌ని వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే పిటిష‌న్‌
  • స్వీక‌రించిన సుప్రీంకోర్టు
  • తాజా పిల్ జ‌త చేయాల‌ని ఆదేశించిన సుప్రీంకోర్టు

రెండు సంవ‌త్స‌రాల క్రితం ఓటుకు నోటు కేసు తెలుగు రాష్ట్రాలను కుదిపేసిన విష‌యం తెలిసిందే. అయితే, ఇప్ప‌టికీ ఈ కేసులో పురోగ‌తి లేద‌ని, కొన్ని పరిణామాల నేపథ్యంలో విచారణలో జాప్యం చోటుచేసుకుందని పేర్కొంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సుప్రీంకోర్టులో పిటిష‌న్ వేశారు. తెలంగాణ ఏసీబీ ఈ కేసులో దర్యాప్తును నిష్పక్షపాతంగా చేయడం లేదని ఆయ‌న పేర్కొన్నారు.

ఈ కేసును సీబీఐ దర్యాప్తుకు అప్పగించాలని కోరారు. ఈ పిటిష‌న్‌ను ప‌రిశీలించిన సుప్రీంకోర్టు దాన్ని స్వీక‌రించింది. దాంతో పాటు ఓటుకు కోట్లు ప్రధాన కేసుకు ఈ తాజా పిల్‌ని జత చేయాలని సూచించింది. విచారణ తేదీలను త్వరలో ఖరారు చేస్తామ‌ని తెలిపింది. 

More Telugu News