Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో చోరీ.. పనిమనిషిపై అనుమానం.. పోలీసుల‌కు ఫిర్యాదు!

  • ఫిర్యాదు చేసిన చిరంజీవి మేనేజ‌ర్
  • ద‌ర్యాప్తు చేస్తోన్న జూబ్లిహిల్స్ పోలీసులు
  • ఇంట్లో ప‌నిచేసే ఓ వ్య‌క్తే ఈ చోరీకి పాల్ప‌డిన‌ట్లు అనుమానం

కాంగ్రెస్ నేత‌, మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో దొంగ‌త‌నం జ‌రిగింది. ఇంట్లోంచి రూ.2 ల‌క్ష‌లు మాయ‌మ‌య్యాయ‌ని చిరంజీవి మేనేజ‌ర్ ఈ రోజు హైద‌రాబాద్‌లోని జూబ్లిహిల్స్ పోలీస్ స్టేష‌న్‌లో ఫిర్యాదు చేశారు. ఇంట్లో ప‌నిచేసే ఓ వ్య‌క్తే ఈ చోరీకి పాల్ప‌డిన‌ట్లు చెప్పారు. ఈ చోరీ త‌రువాత ఆ వ్య‌క్తి క‌నిపించ‌కుండా పోయాడు. చిరంజీవి ఇంట్లో ప‌నిచేసే చెన్న‌య్య అనే వ్య‌క్తి కోసం గాలించిన పోలీసులు చివ‌ర‌కు ఆయ‌న‌ను ప‌ట్టుకున్నారు. ఈ ఘ‌ట‌న‌పై పూర్తి వివ‌రాలు తెలియాల్సి ఉంది. ప్ర‌స్తుతం చిరంజీవి త‌న 151వ చిత్రం ప‌నిలో బిజీగా ఉన్నారు.    

  • Loading...

More Telugu News