mahesh kathi: ప‌వ‌న్ క‌ల్యాణ్ ఫ్యాన్స్ మ‌ళ్లీ వేధిస్తున్నారు..బూతులు తిడుతున్నారు: మ‌హేశ్ క‌త్తి

  • వాట్స‌ప్‌లో తిడుతూ మెసేజ్‌లు పెడుతున్నారు
  • ఫోన్ చేసి బెదిరింపుల‌కు పాల్ప‌డుతున్నారు
  • ఫేస్‌బుక్‌లో ఆవేద‌న వ్య‌క్తం చేసిన సినీ విశ్లేష‌కుడు మ‌హేశ్ క‌త్తి

సినీన‌టుడు, జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ అభిమానులు త‌న‌ను వేధిస్తున్నార‌ని సినీ విశ్లేష‌కుడు మ‌హేశ్ క‌త్తి ఆ మ‌ధ్య మీడియా ముందుకు వ‌చ్చి త‌న బాధ‌ను చెప్పుకున్న విష‌యం తెలిసిందే. అయితే, ప‌వ‌న్ కల్యాణ్ ఫ్యాన్స్ నుంచి తనకింకా వేధింపులు త‌గ్గ‌డం లేదంటున్నాడు. ప‌వ‌న్ క‌ల్యాణ్ అభిమానులంటే ఎలాగుంటారో చెబుతూ వాట్స‌ప్‌లో త‌న‌ను బూతులు తిడుతూ మెసేజ్‌లు పెడుతున్నార‌ని త‌న ఫేస్‌బుక్ ఖాతాలో పేర్కొంటూ ఆవేద‌న వ్య‌క్తం చేశాడు.

ప‌వ‌న్ ఫ్యాన్స్ త‌న‌ను తిడుతున్నార‌డానికి సాక్ష్యంగా వాట్స‌ప్ స్క్రీన్ షాట్‌ని కూడా పోస్ట్ చేశాడు. అందులో ప‌రుష ప‌ద‌జాలంతో మ‌హేశ్ క‌త్తిని పీకే ఫ్యాన్స్ తిట్టిన‌ట్లు క‌న‌ప‌డుతోంది. అలాగే ఓ మొబైల్‌ నెంబ‌రు నుంచి త‌న‌కు కాల్ వ‌చ్చింద‌ని, త‌న‌ను ఓ అభిమాని బెదిరించాడ‌ని ఆ ఫోన్ నెంబ‌రుని మ‌హేశ్ క‌త్తి పోస్ట్ చేశాడు.  

More Telugu News