hicc: నాగోలు-మియాపూర్‌ మధ్య తొలి ద‌శ‌ మెట్రో రైలును ప్రారంభిస్తున్నాం: మహమూద్‌ అలీ

  • పట్టణ రవాణా వ్యవస్థపై హెచ్‌ఐసీసీలో అంతర్జాతీయ సదస్సు
  • మాట్లాడిన తెలంగాణ ఉప ముఖ్య‌మంత్రి మ‌హ‌మూద్ అలీ
  • ఈ నెల 28న మెట్రో తొలిదశ ప్రారంభ‌మని స్ప‌ష్టం

హైద‌రాబాదీల క‌ల‌ల బండి మెట్రోరైల్‌ను ఈ నెలలో ప్రారంభిస్తున్న‌ట్లు తెలంగాణ ప్ర‌భుత్వం ఇప్ప‌టికే ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. న‌గ‌ర‌వాసులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోన్న మెట్రో ప్రారంభోత్స‌వంపై తెలంగాణ ఉపముఖ్యమంత్రి మహమూద్‌ అలీ స్ప‌ష్ట‌మైన ప్ర‌క‌ట‌న చేశారు. పట్టణ రవాణా వ్యవస్థపై ఈ రోజు హైద‌రాబాద్‌లోని హెచ్‌ఐసీసీలో అంతర్జాతీయ సదస్సు జ‌రుగుతోంది.

ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, కేంద్రమంత్రి హరిదీప్‌సింగ్‌ పూరి, వివిధ దేశాల నుంచి వచ్చిన 1000 మంది ప్రతినిధులు హాజ‌రైన ఈ సద‌స్సులో మ‌హ‌మూద్ అలీ మాట్లాడుతూ... ఈ నెల 28న మెట్రో తొలిదశను ప్రారంభించనున్నట్లు, ఆ రోజు నుంచి న‌గ‌రంలోని నాగోలు-మియాపూర్‌ మధ్య మెట్రో రైలు ప‌రుగులు పెట్ట‌నున్న‌ట్లు చెప్పారు. మెట్రో రైల్ ప్రారంభోత్స‌వానికి ఇప్ప‌టికే ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీకి ఆహ్వానం పంపిన విష‌యం తెలిసిందే.  

More Telugu News