tv show: టీవీ కార్య‌క్ర‌మం ద్వారా ప్ర‌జ‌ల ముందుకు రానున్న కేర‌ళ ముఖ్య‌మంత్రి

  • 'నామ్ మున్నొట్టు' పేరుతో టీవీ షో
  • దూరద‌ర్శ‌న్‌తో పాటు ఇత‌ర ఛాన‌ళ్ల‌లో ప్ర‌సారం
  • ప్ర‌భుత్వ విజ‌యాలు, కార్యాచ‌ర‌ణ ఇతివృత్తంగా చ‌ర్చ‌లు

కేర‌ళ ముఖ్య‌మంత్రి పిన‌ర‌యి విజ‌య‌న్ త్వ‌ర‌లో ఓ మ‌ల‌యాళం టీవీ కార్య‌క్ర‌మంలో క‌నిపించనున్నారు. 'నామ్ మున్నొట్టు (మ‌నం ముందుకి)' అనే పేరుతో ఈ కార్య‌క్ర‌మం ప్ర‌సారం కానుంది. దూర‌ద‌ర్శ‌న్‌తో పాటు కొన్ని ఇత‌ర ఛాన‌ళ్ల‌లో ఈ కార్య‌క్ర‌మం ప్ర‌సారం కానుంది. తిరువ‌నంత‌పురంలోని ప్ర‌భుత్వ రంగ సంస్థ సెంట‌ర్ ఫ‌ర్ డెవ‌ల‌ప్‌మెంట్ ఆఫ్ ఇమేజింగ్ టెక్నాల‌జీ ఈ కార్య‌క్ర‌మాన్ని నిర్మిస్తోంది.

ఇప్ప‌టికే కొన్ని ఎపిసోడ్ల చిత్రీక‌ర‌ణ పూర్త‌యిన ఈ కార్య‌క్ర‌మంలో లెఫ్ట్ డెమోక్ర‌టిక్ పార్టీ ప్ర‌భుత్వం సాధించిన విజ‌యాలు, భ‌విష్య‌త్తు కార్యాచ‌ర‌ణ గురించిన చ‌ర్చలు నిర్వ‌హిస్తారు. కేర‌ళ ప్ర‌జ‌లు ఎదుర్కుంటున్న స‌మ‌స్య‌లు, వాటి ప‌రిష్కారాల గురించి ఈ కార్య‌క్ర‌మానికి హాజ‌రైన నిపుణుల‌తో ముఖ్య‌మంత్రి చ‌ర్చిస్తారు. ఈ కార్య‌క్ర‌మానికి గ‌తంలో జ‌ర్న‌లిస్టుగా ప‌నిచేసిన, లెఫ్ట్ మ‌ద్ద‌తు నియోజ‌వ‌ర్గ‌మైన‌ ఆర‌న్‌ముల ఎమ్మెల్యే వీణా జార్జ్ వ్యాఖ్యానం చేయ‌నున్నారు.

More Telugu News