YSRCP: పాదయాత్ర చేసిన ప్ర‌తి వారూ ముఖ్య‌మంత్రి కాలేరు: వ‌ర్ల రామ‌య్య

  • పాదయాత్ర చేసిన ప్ర‌తి వారూ ముఖ్య‌మంత్రి కాలేరు: వ‌ర్ల రామ‌య్య‌
  • జ‌గ‌న్ చాలా కేసుల్లో ముద్దాయిగా ఉన్నారు
  • జ‌గ‌న్ చెడు ఆలోచ‌న‌ల‌తో చేసే ఏ కోరికా నెర‌వేర‌దు
  • జ‌గ‌న్‌ ప‌డుతోన్న క‌ష్టం అంతా వృథా

పాదయాత్ర చేసిన ప్ర‌తి వారూ ముఖ్య‌మంత్రి కాలేరని టీడీపీ నేత‌ వ‌ర్ల రామ‌య్య అన్నారు. ఈ రోజు ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ... చాలా కేసుల్లో ముద్దాయిగా ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత‌ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డిని ప్ర‌జ‌లు ఆద‌రించ‌బోర‌ని చెప్పారు. జ‌గ‌న్ చెడు ఆలోచ‌న‌ల‌తో చేసే ఏ కోరికా నెర‌వేర‌ద‌ని విమ‌ర్శించారు.

జ‌గ‌న్ పాద‌యాత్ర‌లో వైసీపీ నేత‌లు కూడా పాల్గొన‌రని ఎద్దేవా చేశారు. జ‌గ‌న్ పాద‌యాత్ర‌, ఆయ‌న ప‌డుతోన్న క‌ష్టం అంతా వృథా అవుతాయని అన్నారు. ముఖ్య‌మంత్రి కావాలంటే ప్ర‌జ‌ల హృద‌యాల్లో నిల‌వాలని, జ‌గ‌న్‌ పాద‌యాత్ర ఎందుకు చేస్తున్నారో అర్థం కావ‌ట్లేద‌ని వ్యాఖ్యానించారు.

More Telugu News