farewell party: వీడ్కోలు పార్టీలో ఆశిష్ నెహ్రా ముఖాన్ని కేకుతో నింపేసిన స‌హ‌క్రికెట‌ర్లు

  • సోష‌ల్ మీడియాలో ఫొటోలు
  • 18 ఏళ్ల క్రికెట్ కెరీర్‌కి గుడ్‌బై చెప్పిన ఆశిష్ ‌
  • మిత్రులు, కుటుంబ స‌భ్యుల మ‌ధ్య వీడ్కోలు పార్టీ

త‌న 18 ఏళ్ల క్రికెట్ కెరీర్‌కి ముగింపు ప‌లికిన భార‌త క్రికెట‌ర్‌ ఆశిష్ నెహ్రాకు స‌హ‌క్రికెట‌ర్లు వీడ్కోలు పార్టీ ఇచ్చారు. జ‌ట్టు స‌భ్యులు, ఇత‌ర ముఖ్య వ్య‌క్తులు, కుటుంబ స‌భ్యులు మాత్ర‌మే పాల్గొన్న ఈ పార్టీలో ఆశిష్ నెహ్రా ముఖాన్ని కేకుతో నింపేశారు. ఈ పార్టీకి హాజ‌రైన కొంత‌మంది అక్క‌డి ఫొటోల‌ను, వీడియోల‌ను సోష‌ల్ మీడియాలో పెట్టారు.

జ‌ట్టు కెప్టెన్ విరాట్‌కి ఆశిష్ కేకు తినిపించ‌డం, పూర్తిగా కేకుతో నిండిపోయిన ఆశిష్ ను ఈ వీడియో, ఫొటోల్లో చూడొచ్చు. ఆశిష్ ఆప్త మిత్రుడు వీరేంద్ర సెహ్వాగ్ కూడా ఈ పార్టీకి వ‌చ్చాడు. 1997లో రంజీ మ్యాచ్ ద్వారా కెరీర్ ప్రారంభించిన 38 ఏళ్ల ఆశిష్ నెహ్రా, అప్ప‌ట్లో సెహ్వాగ్‌తో క‌లిసి ఢిల్లీ రాష్ట్ర జ‌ట్టులో ఆడాడు.

  • Loading...

More Telugu News