snakes: జంట పాములను చూసి ఆశ్చర్యపోయిన పాఠశాల విద్యార్థులు!

  • పాఠశాల సమీపంలో పాముల సయ్యాట
  • ఆసక్తిగా తిలకించిన విద్యార్థులు
  • సెల్ ఫోన్ లో బంధించి, సోషల్ మీడియాలో పెట్టిన ఉపాధ్యాయులు

పాఠశాలలో జంటపాములను చూసి విద్యార్థులు సంభ్రమాశ్చర్యాలకు లోననై ఘటన కడప జిల్లాలో చోటుచేసుకుంది. దీని వివరాల్లోకి వెళ్తే... కడప జిల్లా ఎల్లుగారిపల్లె పాఠశాల సమీపంలో రెండు సర్పాలు సయ్యాటకు దిగాయి. సుమారు పది నిమిషాల పాటు ఆ రెండు సర్పాలు ప్రపంచాన్ని మరచి సరాగాలాడాయి.

దీంతో పాఠశాలలోని విద్యార్థులు, ఉపాధ్యాయులు ఆ అరుదైన దృశ్యాలను వీక్షించారు. ఉపాధ్యాయులు ఆ సన్నివేశాన్ని తమ సెల్ ఫోన్లలో బంధించి సోషల్ మీడియాలో పెట్టడంతో అది వైరల్ గా మారింది. ఈ సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ, సాధారణంగా పాములు జనారణ్యంలోకి రావని, ఒక వేళ వచ్చినా, వెంటనే పారిపోతాయని, కానీ చిత్రంగా పాఠశాల, పిల్లల కోలహలం ఉన్నప్పటికీ అవి సరాగాలకు దిగడం, పది నిమిషాల పాటు సయ్యాటలాడడం ఆశ్చర్యానికి గురి చేసిందని తెలిపారు. 

More Telugu News