vijay: మొత్తానికి 'అదిరింది' సెన్సార్ పూర్తి చేసుకుంది .. ఆ రోజునే రానుంది!

  • తమిళంలో హిట్ కొట్టిన 'మెర్సల్'
  • 'అదిరింది' పేరుతో తెలుగులోకి 
  • ఈ నెల 9వ తేదీన విడుదల    

విజయ్ కథానాయకుడిగా దీపావళి కానుకగా తమిళంలో వచ్చిన 'మెర్సల్' .. ప్రపంచవ్యాప్తంగా 200 కోట్లకి పైగా వసూలు చేసింది. అదే సమయంలో తెలుగులోనూ ఈ సినిమాను 'అదిరింది' పేరుతో విడుదల చేయాలనుకున్నారు. ఈ సినిమాలోని కొన్ని డైలాగ్స్ వివాదాస్పదం కావడంతో, ఆ ప్రభావం తెలుగు సినిమా విడుదలపై పడింది. ఈ కారణంగానే ఈ సినిమా అనుకున్న సమయానికి సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకోలేకపోయింది.

 ఈ నేపథ్యంలో ఈ సినిమాను రీమేక్ చేసే ఉద్దేశంతోనే .. రిలీజ్ ను ఆపేశారనే ప్రచారం కూడా జరుగుతోంది. ఆ ప్రచారానికి తెరదించేస్తూ తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తిచేసుకుని, యు/ఎ సర్టిఫికేట్ ను సంపాదించుకుంది. దాంతో ఈ సినిమాను ఈ నెల 9వ తేదీన విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇక తెలుగులో ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని రాబడుతుందో చూడాలి.        

More Telugu News