amalapaul: రూ. 20 లక్షల పన్ను ఎగ్గొట్టడంపై స్పందించిన అమలాపాల్!

  • కోటి రూపాయల ఎస్-క్లాస్ బెంజ్ కారు కొన్న అమలాపాల్
  • 20 లక్షల పన్ను ఎగ్గొట్టిందంటూ ఆరోపణలు
  • కేసు నమోదు చేయమన్న కిరణ్ బేడీ 
  • ట్విట్టర్ ద్వారా స్పందించిన అమలాపాల్ 

కొన్న కారుకి 20 లక్షల రూపాయల పన్ను ఎగ్గొట్టిందంటూ తనపై వస్తున్న ఆరోపణలపై సినీనటి అమలా పాల్‌ స్పందించింది. నకిలీ అడ్రెస్‌ ప్రూఫ్‌ తో కోటి రూపాయల విలువ చేసే ఎస్‌-క్లాస్‌ బెంజ్‌ కారు కొనుక్కుందని, దీనికి ట్యాక్స్ 20 లక్షల రూపాయలు ఉంటుందని, ఈ మొత్తాన్ని ఎగ్గొట్టేందుకే ఆమె నకిలీ ప్రూఫ్ తో కారును కొనుగోలు చేసిందని వార్తలు వచ్చాయి. ఈ వార్తలపై పుదుచ్చేరి లెఫ్టినెంట్‌ గవర్నర్‌ కిరణ్‌ బేడీ స్పందిస్తూ, ఆమెపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

వీటిపై తాజాగా అమలా పాల్ తన ట్విట్టర్‌ ఖాతా వేదికగా స్పందిస్తూ..: ఈ నగర జీవితం నుంచి, అనవసరపు ఊహాగానాల నుంచి దూరంగా పారిపోవాలనిపిస్తోంది. అందుకే, బోట్‌ రైడ్‌ కు వెళ్లాలనుకుంటున్నాను" అంటూ కామెంట్ చేసింది. ఇదిలా ఉంచితే, ఈ వ్యవహారంలో ఆమె ఎలాంటి తప్పు చేయలేదని పుదుచ్చేరి రెవెన్యూ, రవాణా శాఖ మంత్రి షాజహాన్‌ క్లీన్ చిట్ ఇచ్చారు. ఆమె కారుకు సంబంధించిన అన్ని వివరాలు చట్టపరిధిలోనే ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు.

More Telugu News