chiranjeevi: చిరంజీవి 152వ చిత్రంలో ప‌వ‌న్ క‌ల్యాణ్ అతిథి పాత్ర?

  • రంగం సిద్ధం చేస్తున్న త్రివిక్ర‌మ్‌
  • టాలీవుడ్ వ‌ర్గాల చర్చ 
  • సోద‌రుడితో మ‌రోసారి న‌టించ‌నున్న చిరు?

151వ చిత్రం 'సైరా న‌ర‌సింహారెడ్డి' త‌ర్వాత 152వ చిత్రాన్ని త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో చిరంజీవి చేయ‌బోతున్న సంగ‌తి తెలిసిందే. అయితే ఈ చిత్రంలో ప‌వ‌న్ క‌ల్యాణ్ అతిథి పాత్ర చేయ‌బోతున్నార‌ని ఫిల్మ్ న‌గ‌ర్‌లో ఓ వార్త చ‌క్క‌ర్లు కొడుతోంది. సినిమాలో ఓ కీల‌క పాత్ర కోసం త్రివిక్ర‌మ్, ప‌వ‌న్ క‌ల్యాణ్‌ను అడిగిన‌ట్లు తెలుస్తోంది. దాదాపు అర‌గంట సేపు ప‌వ‌న్ పాత్ర ఉంటుంద‌ని స‌మాచారం. గ‌తంలో శంక‌ర్ దాదా జిందాబాద్ చిత్రంలో ప‌వ‌న్ అతిథి పాత్ర పోషించారు. అయితే ఈ విష‌యం గురించి ఇంకా అధికారిక ప్ర‌క‌ట‌న రావాల్సి ఉంది. వైజయంతి మూవీస్‌ బ్యానర్‌పై ఈ చిత్రం తెరకెక్కనున్న‌ట్లు తెలుస్తోంది.

మరోపక్క పవన్‌కల్యాణ్‌- త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో ఓ చిత్రం సిద్ధమవుతోంది. ఈ సినిమాకి ‘అజ్ఞాతవాసి’ అనే టైటిల్‌ను ఖరారు చేసే అవకాశం ఉంది. ఇందులో పవన్‌కి జోడీగా అను ఇమ్మాన్యుయేల్‌, కీర్తి సురేశ్‌ నటిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రాన్ని సంక్రాంతికి విడుద‌ల చేసేందుకు చిత్ర‌ బృందం య‌త్నిస్తోంది.

More Telugu News