Hebba patel: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం!

  • ఇంటి పనుల్లో బిజీ కానున్న హెబ్బా పటేల్ 
  • నాగశౌర్య కొత్త చిత్రం 'నర్తనశాల'
  • ఆది సాయికుమార్ కు మూడు సినిమాల డీల్ 
  • ఒకే రోజున అనూ ఇమ్మానుయేల్ రెండు సినిమాలు

*  తనకు తానుగా ఇప్పుడు కొంత గ్యాప్ తీసుకోవాలనుకుంటున్నానని అంటోంది కథానాయిక హెబ్బా పటేల్.  'ఏడాదిన్నరగా విరామం లేకుండా సినిమాలు చేస్తున్నాను. దాంతో అలసిపోయాను, కాస్త రెస్ట్ కావాలి. అదీగాక, ముంబయ్ లో కొత్త ఇల్లు కొన్నాం. ఆ పనులను దగ్గరుండి చూసుకోవాలి. అందుకే కొత్త సినిమాలు ఒప్పుకోవడం లేదు' అని చెప్పింది హెబ్బా. ఈమె నటించిన తాజా చిత్రం 'ఏంజెల్' రేపు విడుదల కానుంది.
*  ప్రస్తుతం 'చలో' చిత్రంలో నటిస్తున్న యువ కథానాయకుడు నాగశౌర్య తాజాగా ఓ కొత్త దర్శకుడికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. కృష్ణవంశీ వద్ద పనిచేసిన శ్రీనివాస్ అనే కుర్రాడు చెప్పిన కథ నచ్చడంతో ఆ ప్రాజక్టును ఒప్పుకున్నాడు. దీనికి 'నర్తనశాల' అనే టైటిల్ నిర్ణయించారు.
*  తాజాగా 'నెక్స్ట్ నువ్వే' చిత్రంలో నటించిన యంగ్ హీరో ఆది సాయికుమార్, కొత్తగా మూడు చిత్రాల డీల్ కు సంతకం చేశాడు. ప్రముఖ తమిళ నిర్మాత జ్ఞానవేల్ రాజా ఈ మూడు చిత్రాలను నిర్మిస్తారు.
*  ప్రస్తుతం ఇటు పవన్ కల్యాణ్ తోను, అటు అల్లు అర్జున్ తోను నటిస్తూ బిజీగా వున్న కథానాయిక అనూ ఇమ్మానుయేల్ నటించిన రెండు చిత్రాలు ఒకే రోజున విడుదల కానున్నాయి. గోపీచంద్ సరసన ఆమె నటించిన 'ఆక్సిజన్', విశాల్ తో నటించిన 'డిక్టేటర్' చిత్రాలు రెండూ కూడా ఈ నెల 10న విడుదల కానుండడం విశేషం!   

More Telugu News