Chandrababu: మ‌రోసారి టీటీడీపీ నేత‌ల‌తో స‌మావేశం కానున్న చంద్ర‌బాబు

  • తెలంగాణ‌లో టీడీపీ బ‌లోపేతంపైనే ప్రధానంగా చర్చ‌
  • రెండేళ్ల‌లో ఎన్నిక‌ల నేప‌థ్యంలో ఎలా ముందుకు వెళ్లాల‌న్న అంశాల‌పై చ‌ర్చ‌లు

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి, తెలుగు దేశం పార్టీ జాతీయాధ్య‌క్షుడు చంద్ర‌బాబు నాయుడు మ‌రోసారి టీటీడీపీ నేత‌ల‌తో స‌మావేశం కానున్నారు. ఇటీవ‌ల అమ‌రావ‌తిలో టీటీడీపీ నేత‌ల‌తో చంద్ర‌బాబు సమావేశం ఏర్పాటు చేయ‌గా, అదే స‌మ‌యంలో కొడంగ‌ల్ నేత రేవంత్ రెడ్డి పార్టీకి, శాస‌న‌స‌భ స‌భ్య‌త్వానికి రాజీనామా చేసిన విష‌యం తెలిసిందే. రేపు నిర్వ‌హించ‌నున్న స‌మావేశంలో తెలంగాణ‌లో టీడీపీ బ‌లోపేతంపైనే ప్రధానంగా చ‌ర్చించ‌నున్న‌ట్లు తెలిసింది. రెండేళ్ల‌లో ఎన్నిక‌లు ఉన్న నేప‌థ్యంలో తెలంగాణ‌లో ఎలా ముందుకు వెళ్లాల‌న్న అంశంపై కీల‌క చ‌ర్చ‌లు జ‌ర‌గ‌నున్నాయి.   

More Telugu News