chaitu: పెళ్లి తరువాత చైతూ చేస్తోన్న సినిమా .. వారం రోజుల్లో 'సవ్యసాచి' రెగ్యులర్ షూటింగ్

  • 'ప్రేమమ్'తో హిట్ కొట్టిన చందూ, చైతు 
  • అదే కాంబినేషన్లో 'సవ్యసాచి'
  • యూత్ కి నచ్చే డిఫరెంట్ కాన్సెప్ట్ 
  • నవంబర్ 8 నుంచి రెగ్యులర్ షూటింగ్         

నాగచైతన్య కథానాయకుడిగా చందూ మొండేటి 'సవ్యసాచి' అనే సినిమాను తెరకెక్కించడానికి రెడీ అవుతున్నాడు. ఈ పాటికే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లవలసి వుంది. చైతూ - సమంతల పెళ్లి కారణంగా ఆలస్యమైంది. ఈ నెల 8వ తేదీ నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టాలని దర్శక నిర్మాతలు నిర్ణయించుకున్నారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి.

 ఇంతకుముందు చందూ మొండేటి - చైతూ కాంబినేషన్లో వచ్చిన 'ప్రేమమ్' సూపర్ హిట్ అయింది. దాంతో ఈ ప్రాజెక్టుపై యూత్ లో ఆసక్తి వుంది. మైత్రీ మూవీస్ వారు నిర్మిస్తోన్న ఈ సినిమాను, డిఫరెంట్ కాన్సెప్ట్ తో చందూ మొండేటి తెరకెక్కించనున్నాడు. నాగ్ కి ఈ కాన్సెప్ట్ బాగా నచ్చేసిందని అంటున్నారు. 'కార్తికేయ' .. 'ప్రేమమ్' తరువాత చందూ మొండేటి చేస్తోన్న ఈ సినిమా, ఆయనకి హ్యాట్రిక్ హిట్ తెచ్చిపెడుతుందేమో చూడాలి.       

  • Loading...

More Telugu News