raviteja: సంక్రాంతి బరిలోకి... బాలకృష్ణ .. పవన్ లతో పాటు రవితేజ?

  • రవితేజ తాజా చిత్రంగా 'టచ్ చేసి చూడు' 
  • దర్శకుడిగా విక్రమ్ సిరికొండ 
  • 50 శాతం చిత్రీకరణ పూర్తి 
  • సంక్రాంతికి రిలీజ్ చేయాలనే ఆలోచన   

రవితేజ ఇప్పుడు మాంచి ఉత్సాహంతో వున్నాడు. చాలా కాలంగా తాను ఎదురుచూస్తోన్న విజయాన్ని 'రాజా ది గ్రేట్' అందించడమే అందుకు కారణం. ఈ సినిమా కంటే ముందుగానే విక్రమ్ సిరికొండ దర్శకత్వంలో ఆయన 'టచ్ చేసి చూడు' సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లాడు. అయితే 'రాజా ది గ్రేట్' కోసం డిఫరెంట్ లుక్ ను కంటిన్యూ చేయవలసి రావడంతో, ఆయన ఈ ప్రాజెక్టును పక్కన పెట్టేశాడు.

 ఇప్పుడు ఈ సినిమా 50 శాతం వరకూ చిత్రీకరణను పూర్తి చేసుకుంది. మిగతా సగాన్ని ఈ రెండు నెలల్లో పూర్తి చేసేసి, సంక్రాంతి కానుకగా విడుదల చేస్తే బాగుంటుందనే ఆలోచనలో రవితేజతో పాటు దర్శక నిర్మాతలు కూడా ఉన్నారట. ఆ దిశగా మిగతా షెడ్యూల్స్ ను ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఆల్రెడీ సంక్రాంతి బరిలోకి దిగడానికి బాలకృష్ణ .. పవన్ సిద్ధమైపోయారు. ఆ సినిమాలకి ఏ స్థాయి క్రేజ్ వుంటుందో తెలిసినప్పటికీ,  'టచ్ చేసి చూడు' కంటెంట్ పై గల నమ్మకంతోనే రంగంలోకి దిగుతున్నారని అంటున్నారు.        

More Telugu News