Amala Paul: నటి అమలాపాల్ మెడకు కారు రిజిస్ట్రేషన్ వ్యవహారం.. విచారణకు గవర్నర్ ఆదేశం

  • పన్ను ఎగవేసేందుకు నటి ఎత్తుగడ
  • తప్పుడు చిరునామాతో పుదుచ్చేరిలో రిజిస్ట్రేషన్
  • పలువురు నటులపైనా ఇవే ఆరోపణలు
కారు నకిలీ రిజిస్ట్రేషన్ వ్యవహారం నటి అమలాపాల్ మెడకు చుట్టుకుంటోంది. ఈ వ్యవహారంపై పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్‌బేడీ విచారణకు ఆదేశించారు. అమలాపాల్ గతేడాది పుదుచ్చేరిలో ‘బెన్స్ ఎస్ క్లాస్’ అనే కారును రూ.1.12 కోట్లకు కొనుగోలు చేశారు. ఈ కారును ఆమె సొంత రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ చేయించాలంటే రూ.20 లక్షలు పన్ను చెల్లించాల్సింది వస్తుందని భావించిన అమలాపాల్ పుదుచ్చేరిలోనే నకిలీ చిరునామాతో రిజిస్ట్రేషన్ చేయించినట్టు ఆరోపణలు ఉన్నాయి.

 ఈ కారును ఆమె ప్రస్తుతం కేరళలో వినియోగిస్తోంది. కారు రిజిస్ట్రేషన్ వ్యవహారంపై జోరుగా వార్తలు రావడంతో స్పందించిన గవర్నర్ ఈ విషయంలో నిజానిజాలు తెలుసుకోవాల్సిందిగా పోలీసులను ఆదేశించారు. అమలాపాల్‌, నటుడు భగత్ పాసిల్ సహా పలువురు నటులు ఇటువంటి ఆరోపణలే ఎదుర్కొంటున్నారు. తప్పుడు చిరునామాతో రిజిస్ట్రేషన్ చేయించి తక్కువ పన్నులు చెల్లించినట్టు అధికారులు చెబుతున్నారు.
Amala Paul
Actress
Kiran Bedi

More Telugu News