Cricket: రేప‌టి నుంచి టీ20 మ్యాచులు.. న్యూజిలాండ్‌పై సిరీస్ గెలిస్తే టాప్‌-2కు చేరుకోనున్న టీమిండియా!

  • భార‌త ప‌ర్య‌ట‌న‌లో ఉన్న న్యూజిలాండ్ క్రికెట్ జ‌ట్టు
  • రేపు రాత్రి 7 గంట‌ల‌కు న్యూఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్ల మైదానంలో మొదటి టీ20
  • ఈ సిరీస్‌లో ఓడితే అగ్ర‌స్థానాన్ని కోల్పోనున్న న్యూజిలాండ్‌
  • భార‌త్ గెలిస్తే రెండో స్థానంలో ఉన్న‌ పాక్‌కు అగ్ర‌స్థానం

భార‌త ప‌ర్య‌ట‌న‌లో ఉన్న న్యూజిలాండ్ క్రికెట్ జ‌ట్టు వ‌న్డే సిరీస్‌ను కోల్పోయిన విష‌యం తెలిసిందే. భార‌త్-న్యూజిలాండ్ జ‌ట్లు ఇక టీ20 స‌మ‌రానికి సిద్ధ‌మ‌య్యాయి. రేపు రాత్రి 7 గంట‌ల‌కు న్యూఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్ల మైదానంలో మొదటి టీ 20 ప్రారంభం అవుతుంది. ప్ర‌స్తుతం బ‌లంగా ఉన్న భార‌త్‌తో న్యూజిలాండ్ ఓడిపోతే క‌ష్టాలు ఎదుర్కుంటుంది. టీ20 ల్లో 125 పాయింట్ల‌తో న్యూజిలాండ్ మొద‌టి స్థానంలో ఉండ‌గా 124 పాయింట్ల‌తో రెండో స్థానంలో పాకిస్థాన్ ఉంది. ఆ త‌రువాత వ‌రుస‌గా వెస్టిండీస్ (120), ఇంగ్లండ్ (119), భార‌త్ (116) ఉన్నాయి.

రేప‌టి నుంచి ప్రారంభం కానున్న టీ20 సిరీస్‌ను ఒకవేళ భార‌త్‌ గెలిస్తే టీ20 ఫార్మాట్ ర్యాంకింగ్స్ లో ఐదో స్థానంలో ఉన్న భారత జట్టు రెండో ర్యాంకుకు చేరుతుంది. అదే స‌మ‌యంలో పాకిస్థాన్ మొద‌టి స్థానంలోకి వ‌స్తుంది. ఒకవేళ కివీస్ గెలిస్తే త‌న పాయింట్ల‌ను మ‌రింత పెంచుకుంటుంది.    

  • Loading...

More Telugu News