kuntiya: తెలంగాణ వ‌చ్చాక కేసీఆర్ కుటుంబానికి మాత్ర‌మే న్యాయం జ‌రిగింది: కుంతియా

  • సామాన్యుడికి న్యాయం జ‌ర‌గలేదు
  • 2019లో అధికారంలోకి వ‌స్తాం
  • తెలంగాణ‌లో క‌ర్ష‌క‌, కార్మికుల త‌ర‌ఫున కాంగ్రెస్ పోరాటం చేస్తుంది

తెలంగాణ వ‌చ్చాక కేసీఆర్ కుటుంబానికి మాత్ర‌మే న్యాయం జ‌రిగిందని, సామాన్యుడికి జ‌ర‌గలేద‌ని తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జ్‌ కుంతియా అన్నారు. ఈ రోజు రేవంత్ రెడ్డితో పాటు ప‌లువురు నేత‌లు కాంగ్రెస్ పార్టీలో చేరిన నేప‌థ్యంలో కుంతియా ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ... 2019లో తామే అధికారంలోకి వ‌స్తామ‌ని చెప్పారు. టీఆర్ఎస్‌కు కాంగ్రెస్ పార్టీ మాత్ర‌మే ప్ర‌త్యామ్నాయమ‌ని చెప్పారు. తెలంగాణ‌లో క‌ర్ష‌క‌, కార్మికుల త‌ర‌ఫున కాంగ్రెస్ పోరాటం చేస్తుంద‌ని చెప్పారు. త‌మ పార్టీపై ప్ర‌జ‌లు న‌మ్మ‌కం ఉంచార‌ని అన్నారు.

More Telugu News