maheshbabu: కీలకమైన సన్నివేశాల చిత్రీకరణలో మహేశ్ బాబు

  • షూటింగ్ దశలో 'భరత్ అను నేను'
  • 'చిరాన్ ఫోర్ట్' లో చిత్రీకరణ 
  • కథానాయికగా కైరా అద్వాని 
  • ఏప్రిల్ 27వ తేదీన విడుదల      

'భరత్ అను నేను' సినిమా షూటింగులో మహేశ్ బాబు బిజీగా వున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతోంది. ఇక్కడి 'చిరాన్ ఫోర్ట్'లో మూడు రోజులుగా కీలకమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఇంతకుముందే సిఎం చాంబర్ కి సంబంధించిన ముఖ్యమైన సన్నివేశాల చిత్రీకరణను పూర్తి చేశారు.

 పొలిటికల్ డ్రామా నేపథ్యంలో కొనసాగే ఈ సినిమాలో, మహేశ్ నటన ఇంతకుముందు చిత్రాలకి మించి ఉంటుందని అంటున్నారు. మహేశ్ అభిమానులకు అన్నివిధాలా సంతృప్తిని కలిగించే విధంగా ఈ సినిమా రూపొందుతోందని చెబుతున్నారు. కైరా అద్వాని తొలిసారిగా ఈ సినిమాలో మహేశ్ బాబు జోడీ కడుతోంది. వచ్చే ఏడాది ఏప్రిల్ 27వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు. 'శ్రీమంతుడు' కాంబినేషన్లో వస్తోన్న ఈ సినిమా కోసం, అభిమానులంతా కూడా ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు.   

More Telugu News